రోడ్డు ప్రమాదంలో యువకుని మృతి

తెలంగాణా జ్యోతి/దోమకొండ: మండలంలోని అంబర్పేట్ సమీపంలో రోడ్డు ప్రమాదంలో 26 ఏళ్ల యువకుడు చనిపోయాడని దోమకొండ ఎస్సై కే సుధాకర్ తెలిపారు. మండలం గన్పూర్ గ్రామానికి చెందిన సాడం రాకేష్ తండ్రి శివరాజం 26 సంవత్సరాలు బుధవారం సాయంత్రం తన అత్తగారీ ఇల్లు అయిన బిబిపేట మండలం జనగామ కు పల్సర్ బైక్ పై వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగిందన్నారు. అంబర్పేట్ రోడ్డు వద్ద అడవి పంది అడ్డు రావడంతో దాన్ని తప్పించే ప్రయత్నంలో కిందపడి స్పాట్లో చనిపోయారని ఎస్ఐ తెలిపారు. మృతుడు రాకేష్ భార్య లాస్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు దోమకొండ ఎస్సై పేర్కొన్నారు.

Leave A Reply

Your email address will not be published.