తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్ : క్షణికావేశంలో ఫినాయిల్ తాగి ఓ యువకుడు ఆసుపత్రి పాలైన ఘటన బీర్కూర్ మండలంలో శుక్రవారం చోటు చేసుకుంది. స్థానికులు, గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం బీర్కూర్ మండలం లోని బైరాపూర్ పంచాయతీ పరిధిలోని నారాయణపురం క్యాంపుకు చెందిన సన్నీ అనే యువకుడు ఆస్తి విషయంలో తండ్రి తో గొడవపడి క్షణికావేశంలో ఫినాయిల్ తాగాడు. ఇది గమనించిన కుటుంబీకులు చికిత్స నిమిత్తం108 వాహనంలో పోలీసులు బాన్సువాడ ఏరియా ఆసుపత్రికి తరలించారు.