రాష్ట్రపతి ప్రసంగాన్ని బాయికాట్ చేసిన ఆప్ ఎంపీలు
తెలంగాణ జ్యోతి వెబ్ న్యూస్: అరవింద్ కేజ్రీవాల్కు సిబిఐ కస్టడీ విధించడాన్ని వ్యతిరేకిస్తూ రాష్ట్రపతి ప్రసంగాన్ని బారుకాట్ చేస్తున్నటు ఆప్ ఎంపిలు ప్రకటించారు. రాష్ట్రపతి మరియు రాజ్యాంగం అత్యున్నతమైనవని, కానీ న్యాయం పేరుతో నియంతృత్వం కొనసాగుతున్నప్పుడు దానిని వ్యతిరేకిస్తూ తమ గొంతుకలను లేవనెత్తడం ముఖ్యమని ఆప్ నేత సందీప్ పాథక్ పేర్కొన్నారు. కేజ్రీవాల్ అరెస్టును నిరసిస్తూ రాజ్యసభలో నేడు ఆప్ ఎంపిలు నిరసన తెలిపారు.
లిక్కర్ స్కామ్ కేసులో ఢిల్లీలోని రోస్ అవెన్యూ కోర్టు సిఎం, ఆప్ కన్వీనర్ కేజ్రీవాల్కి మూడు రోజుల పాటు సిబిఐ కస్టడీ విధించిన సంగతి తెలిసిందే