నటుడు నాగబాబు కుమార్తె నిహారిక కీలక నిర్ణయం
- మాజీ భర్త జొన్నలగడ్డ చైతన్య నుంచి చట్టప్రకారం విడాకులు
తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: నటుడు నాగబాబు కుమార్తె నిహారిక కీలక నిర్ణయం తీసుకుంది. కొంతకాలంగా వివాహ బంధానికి దూరంగా ఉంటున్న ఆమె… మాజీ భర్త జొన్నలగడ్డ చైతన్య నుంచి చట్టప్రకారం విడాకులు తీసుకోవాలని నిర్ణయించుకుంది. ఈ మేరకు కూకట్పల్లి ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించింది. ఇద్దరూ పరస్పర అంగీకారంతో దరఖాస్తు చేసుకున్నారు. హిందూ వివాహచట్టం ప్రకారం విడాకులు కోరారు. ఇందుకు సంబంధించిన దరఖాస్తు ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. పెద్దలు నిశ్చయించిన ఈ పెళ్లి రాజస్థాన్లో హిందూ సాంప్రదాయ పద్దతుల్లో జరిగిందని, పిల్లలు లేరని దరఖాస్తులో ఉంది.కాగా 2020లో చైతన్య జొన్నలగడ్డ – నిహారికల వివాహం జరిగింది. అయితే కారణాలు ఏంటో తెలియదు గానీ వీరిద్దరూ కొంతకాలంగా దూరంగా ఉంటున్న విషయం తెలిసింది. కాగా.. జొన్నలగడ్డ చైతన్య గుంటూరు మాజీ ఐజీ జే ప్రభాకర్ రావు కుమారుడు అనే విషయం తెలిసిందే.