సేవా భావంతో నిస్వార్ధంగా సేవలు అందించిన వారికి సమాజంలో తగిన గుర్తింపు
తెలంగాణాజ్యోతి/వెబ్ న్యూస్: సమాజ సేవలో ముందండి నడిపిస్తున్నటువంటి ఆదూరి డైరెక్టర్ శ్రీనివాసా ని నేడు గాంధీ జయంతి సందర్భంగా కూకట్పల్లిలోని భారత వికాస్ పరిషత్ లో రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ సాయి చౌదరి సన్మానించారు. ఈ సందర్భంగా సాయి చౌదరి మాట్లాడుతూ సమాజంలో ప్రతి ఒక్కరు సేవాభావం పెంపొందించుకోవాలి అని, మహనీయుల ఆశయ సాధనకు యువత నడుం బిగించాలని కోరారు. ఆపదలో ఉన్న వారికి అండగా నిలుస్తూ ఎవరి స్థాయిలో వారు చేతనైన సహకారం అందించాలని, సేవా భావంతో నిస్వార్ధంగా సేవలు అందించిన వారికి సమాజంలో తగిన గుర్తింపు, గౌరవం దక్కుతుందని, ఆదూరి డైరెక్టర్ శ్రీనివాసా ఈ కోవకు చెందిన వారు కాబట్టి గాంధీ జయంతి నాడు సన్మానించుకోవటం మనల్ని మనం సన్మానించుకోవటం అవుతుందని రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ సాయి చౌదరి అన్నారు. ఈ కార్యక్రమమునకు చంద్రబాబు నాయుడు, జీడీ నాయుడు, తదితరులు పాల్గొన్నారు.