తెలంగాణ వచ్చాక గ్రామాలు స్వయం సమృద్ధిని సాధిస్తున్నాయి

- రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్/జనగాం:  తెలంగాణ రాష్ట్రం వచ్చాక గౌరవ ముఖ్యమంత్రి శ్రీ కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ గ్రామాలు స్వయం సమృద్ధిని సాధిస్తున్నాయని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి మరియు గ్రామీణ నీటి సరఫరా శాఖల మంత్రి దయాకర్ రావు అన్నారు. పాలకుర్తి నియోజకవర్గం, రాయపర్తి మండలం, రాగన్న గూడెంలో సేంద్రీయ ఎరువులు తయారు చేస్తూ సేంద్రీయ వ్యవసాయం చేస్తున్నారు. ఇందులో భాగంగా నేడు ఆ గ్రామానికి వెళ్ళిన మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు గారికి సేంద్రీయ ఎరువులు ఆ గ్రామస్తులు అందించారు. సీఎం కేసీఆర్ గారి మార్గదర్శనంలో తెలంగాణ పల్లెలు పచ్చగా మారాయని, పసిడి పంటలు పండిస్తున్నాయని, ఇపుడు ఆరోగ్య తెలంగాణలో భాగంగా సేంద్రీయ వ్యవసాయంలోనూ ముందడుగు వేస్తున్నాయి అని తెలిపారు. సేంద్రీయ ఎరువులు తయారు చేసిన గ్రామస్తులను అభినందించి సేంద్రీయ ఎరువుల పాకెట్ వారి నుంచి కొనుగోలు చేశారు. గ్రామ పంచాయతీలు ఈ విధంగా సంపాదించి స్వయం సమృద్ధితో విలసిల్లాలని ఆకాంక్షించారు.

Leave A Reply

Your email address will not be published.