మళ్లీ రూ.1,000 కోట్ల అప్పు తెచ్చిన  వైసీపీ ప్రభుత్వం

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: వైసిపి ప్రభుత్వం మళ్లీ రూ.1,000 కోట్ల అప్పు తెచ్చింది. మంగళవారం ఆర్‌బీఐ నిర్వహించే సెక్యూరిటీ బాండ్ల వేలం లో రాష్ట్ర ప్రభుత్వం పాల్గొని సెక్యూరిటీలు అమ్మి రూ.1000 కోట్లు అప్పు తీసుకుంది. పదేళ్లకు 7.69 శాతం వడ్డీతో రూ.వెయ్యి కోట్ల సెక్యూరిటీ బాండ్ల వేలం వేసి రుణం తీసుకుంది. కేంద్రం ఇచ్చిన రూ.4,557 కోట్లలో ఇప్పటికే 3వేల కోట్లు ప్రభుత్వం వాడేసింది. మరో రూ.1,557 కోట్లకు మాత్రమే అవకాశం ఉంది. మరో వారం రోజుల్లో మళ్లీ వేతనాలు, పెన్షన్ల కోసం వెతుకులాటే.. జీతాలు, పెన్షన్లకు రూ.5,500 కోట్లు అవసరం అవుతుంది. కాగా ఇప్పటికే వేతనాలు, పెన్షన్లు, బకాయిలపై సీఎస్‌ను గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ప్రశ్నించిన విషయం తెలిసిందే.

Leave A Reply

Your email address will not be published.