హైదరాబాద్ నుంచి ఢిల్లీకి బయలు దేరిన ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున్ ఖర్గే..
తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: ఎఐసిసి అద్యక్షులు మల్లికార్జున్ ఖర్గే హైదరాబాద్ నుంచి ఢిల్లీకి బయలు దేరి వెళ్లారు. బుదవారం ఉదయం నుంచి తాజ్ కృష్ణ లో ఆయనను టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి, ఏఐసీసీ ఇంచార్జ్ మనిక్కమ్ ఠాగూర్ ఏఐసీసీ కార్యదర్శులు సంపత్ కుమార్, నదీమ్ జావిద్, బోసు రాజు, మల్లు రవి, వి.హనుమంతరావులు కలిశారు. శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో ఖర్గేకు టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి, మనిక్కమ్ ఠాగూర్, హర్కర వేణుగోపాల్ తదితరులు వీడ్కోలు పలికారు.