హైదరాబాద్ కు చేరుకున్న ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున్ ఖర్గే
తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: హైదరాబాద్ కు చేరుకున్న ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున్ ఖర్గే కు శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో కాంగ్రెస్ నాయకులు ఘన స్వాగతం పలికారు. ఏఐసీసీ ఆఅధ్యక్షులు అయ్యాక మొదటి సారిగా తెలంగాణ కు వచ్చిన మల్లికార్జున్ ఖర్గేకు నాయకులు పుష్ప గుచ్చాలు ఇచ్చి స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో ఏఐసీసీ అగ్ర ప్రధాన కార్యదర్శి కే.సి వేణు గోపాల్, ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఏఐసీసీ కార్యదర్శి వంశీచంద్ రెడ్డి, ప్రచార కమిటీ ఛైర్మన్ మధు యాష్కీ, మాజీ పీసీసీ అధ్యక్షులు పొన్నాల లక్ష్మయ్య, మాజీ మంత్రి షబ్బీర్ అలీ, ప్రోటోకాల్ చైర్మన్ హర్కర వేణుగోపాల్ తదితరులు పాల్గొన్నారు.