అల్లూరి సీతారామరాజు స్పూర్తి ని ఆదర్శంగా తీసుకోవాలి
తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: అల్లూరి సీతారామరాజు 125 వ జయంతి మహనీయుడుకు శివసేన పార్టీ ఆద్వర్యం లో ట్యాంక్ బండ్ పైన అల్లూరి సీతారామరాజు గారి విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్బంగా శివసేన పార్టీ రాష్ట్ర ప్రదాన కార్యదర్శి ఏ.సుదర్శన్ మాట్లాడుతూ నేటి యువత అల్లూరి సీతారామరాజు ని ఆదర్శంగా తీసుకొని దేశం కోసం ధర్మం కోసం సేవ చేయాలని పిలుపు నిచారు. మనిషి పుట్టడం గొప్ప కాదు పది మంది కి మంచి పనులు చేయాలని అన్నారు. మహానీయుడి జయంతి ని ప్రతి ఒక్కరూ జరుపుకోవాలని యువత ను ఒక మంచి మార్గంలో పెట్టాలని తద్వారా దేశానికి సేవ చేయడానికి ఉపయోగపడుతుందన్నారు. చాలామంది యువకులు వివిధ పార్టీల నాయకులు శ్రీ అల్లూరి సీతారామరాజుని విస్మరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసారు. అతి చిన్న వయసులోనే భారత దేశ స్వాతంత్రం కోసం ప్రాణాలర్పించిన గొప్ప వీరుడు అల్లూరి అని కొనియాడారు.ఈ కార్యక్రమం లో గౌటి గణేష్ యువసేన తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు మరియు క్రాంతి కుమార్ శ్రీనివాస్ సాయి కుమార్ విక్రమ్ తదితరులు పాల్గొన్నారు.