పూర్వవిద్యార్థుల సమ్మేళనం
రామకృష్ణాపూర్ పట్టణంలోని సింగరేణి ఉన్నత పాఠశాలలో శనివారం పూర్వ విద్యార్థుల సమ్మేళనం కార్యక్రమం నిర్వహించారు. 1977 నుండి 2011వ సంవత్సరం వరకు చదివిన సుమారు 2000 మంది పూర్వ విద్యార్థులు, దాదాపు 200 మంది ఉపాధ్యాయులు సమ్మేళనం కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈసందర్బంగా తమ పూర్వ జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు. అనంతరం ఒకరినొకరు క్షేమ సమాచారం తెలుసుకుని ఆనందంగా గడిపారు.