ఆంధ్రుల రాజధాని అమరావతే

.. టీడీపీ అధినేత చంద్రబాబు

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: ఆంధ్రుల రాజధాని అమరావతే.. అమరావతి మళ్లీ ఊపిరి పోసుకుంటుంది.. అమరావతే నిలుస్తుంది.. గెలుస్తుంది.. ఇదే ఫైనల్‌’ అన్నారు టీడీపీ అధినేత చంద్రబాబు ట్విటర్ వేదికగా ఆయన అమరావతిపై కామెంట్స్ చేశారు. ఏడేళ్ల క్రితం ఇదే రోజు ఉద్ధండరాయునిపాలెంలో ప్రధాని మోదీ చేతుల మీదుగా అమరావతికి  శంకుస్థాపన జరిగిందన్నారు. వెయ్యేళ్లపాటు తెలుగుజాతి గుండెచప్పుడుగా నిలుస్తుందని ఆకాంక్షించామని చంద్రబాబు తెలిపారు. పాలకుల వ్యతిరేక ఆలోచనల కారణంగా అంతా నాశనమైందన్నారు. అమరావతి అంటే 28 వేల మంది రైతుల త్యాగమని.. కోట్ల మంది సంకల్పమన్నారు. ప్రాంతాలకు అతీతంగా అమరావతిని గర్వకారణంగా భావించారన్నారు. అధికారంలోకి రాగానే మాట మార్చి మోసం చేశారన్నారు. రైతుల పాదయాత్రపై వైసీపీ కుతంత్రాలు సాగవని చంద్రబాబు పేర్కొన్నారు.

Leave A Reply

Your email address will not be published.