పంజాగుట్టలో అంబేద్కర్ విగ్రహం పెట్టేందుకు అనుమతి ఇవ్వాలి
తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: సీఎస్ శాంతకుమారిని కాంగ్రెస్ నేతల బృందం కలిసింది. పంజాగుట్టలో అంబేద్కర్ విగ్రహం పెట్టేందుకు అనుమతి ఇవ్వాలని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క వీహెచ్, శ్రీధర్బాబు, మల్లురవి, రాములు నాయక్ సీఎస్ను కోరారు. అంబేద్కర్ విగ్రహం కోసం కోర్టు చుట్టూ తిరగాల్సి రావడం బాధాకరమని కాంగ్రెస్ నేతలు వాపోయారు. అంబేద్కర్ను అవమానిస్తే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు.