మార్చి 16న ఏం జరగబోతుంది అరెస్టులు ఖాయం అంటున్న అమిత్ “షా”

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్/హైదరాబాద్: ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో ఊహించని పరిణామాలు జరుగుతున్నాయి. ఎవరి ఊహకూ అందని విధంగా.. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత విచారణ సమయంలోనే ఈడీ (ED) తరఫున కేసులు వాదించే అడ్వకేట్‌ నితీశ్‌ రానా తప్పుకోవడం చర్చనీయాశంగా మారింది. ఈడీ కేసులను వాదించే పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ నితీశ్‌ రానా అకస్మాత్తుగా వైదొలగడంతో ఈ కేసులను వాదించడంలో ఏమైనా ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందా? అన్న చర్చ కూడా జరుగుతున్నది.

ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను ఈడీ విచారించిన తరువాతనే నితీశ్‌ రానా తప్పుకోవడంలో ఆంతర్యం ఏమిటన్న చర్చ జరుగుతోంది. దీనితోపాటే ఈ నెల 16 వ తేదీ విచారణ తరువాత కవితను అరెస్ట్‌ చేస్తారా? లేదా? వదిలేస్తారా? ఏమి జరుగనున్నదనే చర్చ రాజకీయవర్గాల్లో జరుగుతున్నది.

Leave A Reply

Your email address will not be published.