కుధ్రశక్తుల కోసం 8 ఏళ్ల చిన్నారి బలి

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: మాల్దా జిల్లా ఛన్హల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గౌరాండ గ్రామలో ఘోరం జరిగింది. స్థానికులు చెప్పిన వివరాల ప్రకారం… గ్రామానికి చెందిన చెందిన బిక్రమ్ భగత్ అనే వ్యక్తి క్షద్రపూజలు చేస్తుంటారు. భూత వైద్యుడిగా అతడు గ్రామస్తులందరికీ సుపరిచితమైన వ్యక్తి. బుధవారం సాయంత్రం తన పొరుగింట్లో ఉండే 8 ఏళ్ల బాలికకు మాయమాటలు చెప్పి.. గ్రామంలోని చెరువు వద్దకు తీసుకెళ్లాడు. అక్కడ క్షుద్రపూజలు చేసి.. పాపను గొంతుకోసి చంపాడు. పాపను బలిస్తే.. అతింద్రీయ శక్తులు వస్తాయని నమ్మాడు. ఈ క్రమంలోనే ఆ పాపను నరబలి ఇచ్చాడు. మరుసటి రోజు ఉదయం చెరువు సమీపంలో బాలిక మృతదేహన్ని చూసిన కొందరు స్థానికులు.. కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. విగత జీవిగా పడి ఉన్న పాపను చూసి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు. సాయంత్రం బిక్రమ్ భగత్ వెంట పాప వెళ్లిందని పలువురు చెప్పడంతో.. పాప బంధువులు అతడిని పట్టుకున్నారు. ఇంటిని ధ్వంసం చేసి..బిక్రమ్ భగత్‌ను చావబాదారు. గ్రామస్తులంతా కలిసి అతడిపై దాడి చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు గ్రామానికి వెళ్లి.. వారి నుంచి నిందితుడిని కాపాడారు. అనంతరం ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం అతడి పరిస్థితి విషమంగా ఉంది. పాప మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటన తర్వాత గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. నిందితుడిని ఉరితీయాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. మరుసటి రోజు ఉదయం చెరువు సమీపంలో బాలిక మృతదేహన్ని చూసిన కొందరు స్థానికులు.. కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. విగత జీవిగా పడి ఉన్న పాపను చూసి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు. సాయంత్రం బిక్రమ్ భగత్ వెంట పాప వెళ్లిందని పలువురు చెప్పడంతో.. పాప బంధువులు అతడిని పట్టుకున్నారు. ఇంటిని ధ్వంసం చేసి..బిక్రమ్ భగత్‌ను చావబాదారు. గ్రామస్తులంతా కలిసి అతడిపై దాడి చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు గ్రామానికి వెళ్లి.. వారి నుంచి నిందితుడిని కాపాడారు. అనంతరం ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం అతడి పరిస్థితి విషమంగా ఉంది. పాప మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటన తర్వాత గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. నిందితుడిని ఉరితీయాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.

Leave A Reply

Your email address will not be published.