మునుగోడు ఎన్నికల వేళ బీజేపీకి ఊహించని షాక్.. టీఆర్ఎస్‌లోకి మాజీ ఎమ్మెల్యే..

తెలంగాణ జ్యోతి/ వెబ్ న్యూస్ : మునుగోడు ఎన్నికల వేళ తెలంగాణ రాజకీయాలు శరవేగంగా మారుతున్నాయి. కీలక నేతల పార్టీలు మారుతున్నారు. ఇటు నుంచి అటు, అటు నుంచి ఇటు జంప్ చేస్తున్నారు. ఈ క్రమంలో పక్క పార్టీల నుంచి చేరికలతో జోష్ మీదున్న బీజేపీకి ఊహించని షాక్ తగిలింది.  ఆలేరు మాజీ ఎమ్మెల్యే భిక్షమయ్య గౌడ్ కమలం పార్టీకి గుడ్ బై చెప్పారు. పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి ఇవాళ ఆయన రాజీనామా చేశారు.  తెలంగాణపై బీజేపీ వివక్ష చూపుతోందని.. పార్టీలో  బడుగు, బలహీనవర్గాలకు అన్యాయం జరుగుతోందని ఆరోపించారు.  రాజగోపాల్ రెడ్డి ఆర్థిక  లాభం కోసమే మునుగోడు ఉప ఎన్నిక వచ్చిందని అన్నారు. ఆ పార్టీలో ఇమడలేకే రాజీనామా చేస్తున్నానని తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.