నిరుపేదలకు అండ పిఎస్జి స్మారక ఫౌండేషన్
తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: నిరుపేదలకు పాలకూరల శివయ్య గౌడ్ స్మారక ఫౌండేషన్ అండగా నిలుస్తోంది. బొల్లెపల్లి గ్రామానికి చెందిన పాండాల కల్పన ఇటీవల ఆమె భర్త అకాల మరణం గూర్చి తెలుసుకున్న పిఎస్జి చర్మెన్ పాలకూర మరళి నిరుపేద స్థితిలో ఉన్న ఆమెకు ఫౌండేషన్ ఆధ్వర్యంలో 4000 రూపాయల ఆర్థిక సహాయం అందజేశారు. ఈ సందర్బంగా పాలకూర మరళి మాట్లాడుతూ తమ ఫౌండేషన్ ఆద్వర్యం లో నిరుపేదలకు తమకున్న ఆర్దిక వనరులకు లోబడి ఆర్దిక సయాయాన్ని అందజేస్తున్నట్లు తెలిపారు.ముక్యంగా చదువుకోడానికి ఆర్దిక స్తోమతలేని పిల్లలకు పుస్తకాలు, నోట్ బుక్స్, స్కూల్ డ్రెస్ లాంటివి అందజేయడం జరుగుతున్దని తెలుపారు. తమ సంస్థ చేస్తున్న ఈ సహాయ కార్యక్రమాని కి దాతలు తమకు సహకరించాలని కోరారు.వారి పిల్లలు సాహితీ 13 నీరజ్ 11 భవిష్యత్తులో వారికి చదువుల కొరకు ఆర్థిక సాయం అందజేయడం జరుగుతుందని తెలిపారు. ఫౌండేషన్ కార్యాలయం జరిగిన ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ సభ్యులు ఎన్ లింగనాథ్, ఎన్ కావ్య, ఎం శిరీష పాల్గొన్నారు.