వైసీపీ సాధికారిక బస్సుయాత్రను అడ్డుకున్న‌ అంగన్ వాడీ మహిళలు

తెలంగాణ జ్యోతి వెబ్ న్యూస్: నెల్లూరు జిల్లా వెంకటగిరిలోని రాపూరు క్రాస్ రోడ్డు వద్ద వైసీపీ సాధికారిక బస్సుయాత్రను అంగన్ వాడీ మహిళలు అడ్డుకున్న‌ారు. సీఎం జగన్ ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. జీతాలు ఎందుకు పెంచరంటూ నేతలను అంగన్ వాడీ మహిళలు ప్రశ్నించారు. వైసీపీ ప్రజాప్రతినిధులు, నేతలపై తీవ్ర ఆగ్రహం‌ వ్యక్తం చేశారు. దీంతో కొద్దిసేపు తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. అంగన్ వాడీ మహిళలను పోలీసులు పక్కకులాగి బస్సుయాత్రను కొనసాగించారు.

Leave A Reply

Your email address will not be published.