మ‌రో 2,391 పోస్టుల భ‌ర్తీకి రాష్ట్ర ఆర్థిక శాఖ అనుమ‌తి

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: తెలంగాణ రాష్ట్ర ప్ర‌భుత్వం నిరుద్యోగ అభ్య‌ర్థుల‌కు మ‌రో శుభ‌వార్త వినిపించింది. మ‌రో 2,391 పోస్టుల భ‌ర్తీకి రాష్ట్ర ఆర్థిక శాఖ అనుమ‌తి ఇచ్చింది. ఈ మేర‌కు రాష్ట్ర ఆర్థిక మంత్రి హ‌రీశ్‌రావు ట్వీట్ చేశారు. ఈ ఖాళీ పోస్టుల‌ను టీఎస్‌పీఎస్సీ, మెడిక‌ల్ హెల్త్ బోర్డు, మ‌హాత్మా జ్యోతిబాపూలే గురుకుల‌ విద్యాసంస్థ భ‌ర్తీ చేయ‌నుంది.బీసీ గురుకులాల్లో మొత్తం 1,499 పోస్టుల‌ను భ‌ర్తీ చేయ‌నున్నారు. ప్రిన్సిపాల్ పోస్టులు 10, డిగ్రీ లెక్చ‌ర‌ర్స్ 480, జూనియ‌ర్ లెక్చ‌ర‌ర్స్ 185, పీజీటీ 235, టీజీటీ 324 పోస్టుల‌ను భ‌ర్తీ చేయ‌నున్నారు. స‌మాచార పౌర సంబంధాల శాఖ‌లో 166 పోస్టుల భ‌ర్తీకి అనుమ‌తి ఇచ్చింది ఆర్థిక శాఖ‌.

Leave A Reply

Your email address will not be published.