మ‌రో వివాదంలో కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ

-  లోక్‌స‌భ‌లో ఆయ‌న ఫ్ల‌యింగ్ కిస్ - దీనిపై అభ్యంత‌రం వ్య‌క్తం చేసిన  కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీమ‌రో వివాదంలో ఇరుక్కున్నారు. లోక్‌స‌భ‌లో ఆయ‌న ఫ్ల‌యింగ్ కిస్ ఇచ్చారు. రాహుల్ గాంధీ ఇచ్చిన ఫ్ల‌యింగ్ కిస్‌పై వివాదం చెల‌రేగింది.  అయితే ఆ కిస్ ఎవ‌రికి ఇచ్చార‌న్న‌ది స్ప‌ష్టంగా తెలియ‌దు. కానీ అవిశ్వాస తీర్మానంపై ప్ర‌సంగం ముగించే స‌మ‌యంలో ఆయ‌న ఫ్ల‌యింగ్ కిస్ ఇచ్చారు. ఇక రాహుల్ త‌ర్వాత అవిశ్వాస తీర్మానంపై కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ మాట్లాడారు. రాహుల్ గాంధీ ప్ర‌వ‌ర్త‌న స‌రిగా లేద‌ని ఆమె ఆరోపించారు. బీజేపీ మ‌హిళా ఎంపీల‌పై రాహుల్ ఫ్ల‌యింగ్ కిస్ ఇచ్చిన‌ట్లు ఆ పార్టీ నేత‌లు ఆరోపిస్తున్నారు. బ‌హుశా మంత్రి స్మృతి ఇరానీని టార్గెట్ చేస్తూ రాహుల్ ఆ కిస్సింగ్ సంకేతాలు ఇచ్చి ఉంటాడేమో అని భావిస్తున్నారు.లోక్‌స‌భ‌లో ఇవాళ త‌న ప్ర‌సంగం స‌మ‌యంలో రాహుల్ ఫ్ల‌యింగ్ కిస్ ఇచ్చారు. దీనిపై కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ అభ్యంత‌రం వ్య‌క్తం చేశారు. స్త్రీద్వేషి మాత్ర‌మే ఇలాంటి సంకేతాలు చేస్తార‌ని స్మృతి విమ‌ర్శించారు. బీజేపీ మ‌హిళా ఎంపీలు రాహుల్ ప్ర‌వ‌ర్త‌నపై స్పీక‌ర్ బిర్లాకు ఫిర్యాదు చేశారు.

Leave A Reply

Your email address will not be published.