ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో మరో కీలక పరిణామం

-కుంభకోణంలో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పేరు. - ఎక్సయిజ్ పాలసీ, లిక్కర్ కంపెనీల్లో భాగస్వామ్యం

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్/బ్యూరో చీఫ్: ఎమ్మెల్సీ. కవిత గుట్టు ఎట్టకేలకు ఈజీకి చిక్కింది. తన సంభాషణలు బాహ్య ప్రపంచానికి  తెలియకుండా వినియోగించినా ఫలితం లేకపోయింది. ఎక్సయిజ్ పాలసీ రూపకల్పన నుంచి లిక్కర్ స్కాం భాగస్వామ్యం వరకు ఆమె ప్రమేయం ఎలా ఉన్నదో వివరిస్తూ ఢిల్లీ డౌన్ అవెన్యూ స్పెషల్ కోర్టుకు ఈడీ చార్జిషీట్ సమర్పించింది. వీటి ఆధారంగా కవితను మాగుంటను ఫిక్స్ చేసిన ఈడీ.. తదుపరి ఎలాంటి చర్యలు తీసుకోనున్నదనేది ఆసక్తికరంగా మారింది. ఢిల్లీ మద్యం కుంభకోణంలో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పేరు. తెరపైకి వచ్చింది. ఆ రాష్ట్ర ఎక్సయిజ్ పాలసీ రూపకల్పన నుంచి లిక్కర్ కంపెనీల్లో భాగస్వామ్యం వరకు ఆమె ప్రమేయం ఉన్నట్లు తేలింది. ఢిల్లీ డౌస్ అవెన్యూ స్పెషల్ కోర్టుకు సమర్పించిన సమీర్ మహేంద్రు చార్జిషీట్లో ఈదీ ఈ వివరాలు వెల్లడించింది. ఆమ్ ఆద్మీ పార్టీ నేతలతో కవిత చర్చలు జరిపి రూ. 100 కోట్ల డీల్ కుదిర్చారని, ప్రతిఫలంగా ఆమెకు ఎల్-1గా నిలిచిన ఇండో స్పిరిట్స్ కంపెనీలో వాటాలు దక్కాయని వెల్లడైంది. ఇందులో మాగుంట శ్రీనివాసులు రెడ్డికీ వాటా ఉన్నది. తొలుత బంజారాహిల్స్లోని ఆమె నివాసంలో ప్రాథమికంగా చర్చలు జరిగాయి. అందులో కవితతో పాటు బోయినపల్లి అభిషేక్, ఆడిటర్ గోరంట్ల బుచ్చిబాబు, అరబిందో ఫార్మా ఫుల్ టైమ్ . డైరెక్టర్ శరత్చంద్రా రెడ్డి పాల్గొన్నారు. దీనికి కొనసాగింపుగా వైఎస్సార్సీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి సహకారంతో శరత్ చంద్రారెడ్డి, అభిషేక్, బుచ్చిబాబుతో కలిసి చార్డర్ ప్లయిట్ ఢిల్లీకి వెళ్లిన కవిత అక్కడే ఒబెరాయ్ మెయిడెన్ హోటల్లో తదుపరి చర్చలు జరిపినట్లు ఈడీ వివరించింది. ఇండో స్పిరిట్స్ కంపెనీలో నేరుగా కవిత పేరు లేకపోయినా ఆమె తరఫున అరుణ్ రామచంద్రన్ విళ్లయ్ ప్రతినిధిగా వ్యవహారం నడిపారని తేలింది. ఈ కుంభకోణంలో నిందితుడిగా ఉన్న సమీర్ మహేంద్రుతో ఎమ్మెల్సీ కవిత ఫేస్ టైమ్ (ఐఫోన్ లోని ఓ ఆప్షన్)లో సంభాషణలు జరిపారు. ఆ తర్వాత గతేడాది మే నెలలో హైదరాబాద్లోని ఆమె నివాసంలో ముఖాముఖి చర్చలు జరిగాయి. ఈ సమావేశంలో కవిత భర్త వ్యాపసపల్లి అనిల్ సైతం ఉన్నట్టు ఈడి పేర్కొన్నది. ఈ వివరాలను నవంబరు 11వ ఈడీకి ఇచ్చిన వాంగ్మూలంలో పెళ్లయ్ వెల్లడించారు.

ఢిల్లీ లిక్కర్ పాలసీలో తనకు ఎలాంటి సంబంధమూ లేదని, రాజకీయంగా టీఆర్ఎస్ పార్టీని ఎదుర్కోలేక బీకేపీ తన పరిధిలో ఉండే దర్యాప్తు సంస్థలతో కక్షసాధింపు చర్యలకు పాల్పడుతున్నదని ఇటీవల కవిత ఆరోపించారు. ఈడీ, ఐటీ, సీబీఐ లాంటి సంస్థలతో దాడులు చేయించి భయపెట్టే ప్రయత్నం చేస్తున్నదని, ఇలాంటివాటర్ భయపడే ప్రసక్తే లేదని కూడా నొక్కిచెప్పారు. ఈ ప్రకటనల నేపథ్యంలో ఈడీ చార్జిషీటులో ఆమెకు ఈ స్కామ్తో ఎలాంటి ఉన్నాయో వివరాలతో వెలుగులోకి రావడం రాష్ట్రంలోనే కాక దేశవ్యాప్తంగా సంచలనం రేకెత్తించింది. సమీర్ మహేంద్రు అభియోగాలకు సంబంధించి ఈడీ దాఖలు చేసిన చార్జిషీట్ను డౌన్ ఎవెన్యూ స్పెషల్ కోర్టు ఆమోదించి జనవరి 5న ట్రయల్ ప్రారంభించనున్నట్లు జడ్జి ఎంకే నాగ్పాల్ ప్రకటించిన రోజునే ఈ వివరాలు బహిర్గతం కావడం గమనార్హం.

కవితతో కలిసి ఆరుళ్ రామచంద్రన్ పిళ్లయ్, బోయిన్ పల్లి అభిషేక్ గతంలో తిరుమల శ్రీవారి ఆలయం ముందు ఫోటో దిగారు. ఈ ముగ్గురి మధ్య ఎలాంటి వ్యాపార సంబంధాలు ఉన్నాయో ఇప్పటివరకు బాహ్య ప్రపంచానికి తెలియలేదు. కానీ ఈడీ ఛార్జిషీట్ను చూసిన తరువాత ఢిల్లీ లిక్కర్ స్కామ్లో భాగంగా సమీర్ మహేంద్రు డైరెక్టర్గా ఉన్న అండో స్పిరిట్స్ సంస్థలో కవితకు వ్యాపార -భాగస్వామ్యం ఉన్నది వెలుగులోకి వచ్చింది. ఆమె తరపున ఆరు రామచంద్రన్ పిళ్లయ్ ప్రతినిధిగా వ్యవహరిస్తున్నారు. బోయిన్ పల్లి అభిషేక్ తో కలిసి హైదరాబాద్లోని నివాసంలో ఢిల్లీ ఎక్సయిజ్ పాలసీ రూపకల్పనలో పైరవీలపై చర్చించారు. ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డితో కలిసి కల్వకుంట్ల కవితకు 65% వాటాలు ఉన్నట్లు ఈడీ దర్యాప్తులో తేలింది. కవిత తరఫున ప్రతినిధిగా వ్యవహరిస్తున్న అరుణ్ రామచంద్రన్ ధ్రువీకరించారు.

ఎక్సయిజ్ పాలసీలో అనుకూలంగా నిబంధనలు పెట్టడం ద్వారా ఏ మేరకు కిక్ బ్యాక్ రూపంలో లాభాలు తిరిగి వస్తాయో ఆమ్ ఆద్మీ పార్టీ / నేతలతో కల్వకుంట్ల కవిత సంప్రదింపులు జరిపినట్లు గత నెల 11న పిళ్లయ్ ఇచ్చిన స్టేట్మెంట్లోని వివరాలను ఈడీ ప్రస్తావించింది. ఆప్ నేతలకు తొలుత అడ్వాన్ను రూపంలో సమకూర్చడం ద్వారా తిరిగి పాలసీ అమలైన తర్వాత హోల్సేల్ వ్యాపారుల ద్వారా లాభాలు వస్తాయని వివరించిన కవిత చివరకు ఇండో స్పిరిట్స్ కంపెనీలో షేర్ దక్కించుకున్నట్లు ఏళ్లయ్ ఆ స్టేట్ మెంట్లో తెలిపారు.

అయితే ఎక్కడా ఆమె పేరు ఉండదని, ఆమె తరఫున అన్నీ తానే నిర్వహిస్తున్నట్లు స్పష్టం చేశారు. ఇండో- -స్పిరిట్స్ కంపెనీలో వాటాలు కావాలంటే నిబంధనల ప్రకారం తాగితాల్లో (రికార్డుల్లో) కొన్ని వివరాలు చూపించాల్సి ఉంటుందని, దానిలో భాగంగానే కొద్దిమంది దగ్గర రుణాలు తీసుకున్నట్లు పేపర్లు సిద్ధం చేసినట్లు పెళ్లయ్ వివరించారు. ఇండో స్పిరిట్స్ వ్యాపార సంబంధాల కోసమే సమీర్ మహేంద్రును హైదరాబాద్ పిలిపించానని, తానే కల్వకుంట్ల కవితతో ఓ మీటింగ్ అరేంజ్ చేశాసని పిళ్ల తెలిపారు. ఇండో స్పిరిట్స్ కంపెనీ పేరు. తపడి ఉంటున్నా.. మొత్తం ఆర్థిక వ్యవహారం. కల్వకుంట్ల కవితదేనంటూ తాను సమీర్ స్పష్టంగా వివరించానని పెళ్లయ్ నొక్కిచెప్పారు.

శరత్ చంద్రా రెడ్డి లిక్కర్ హోల్సేల్ వ్యాపారం కన్నా రిటైల్ బిజినెస్పైనే ఎక్కువ ఆసక్తి చూపారని తెలిపారు. ఢిల్లీలోని ఒబెరాయ్ హోటల్లో ఏర్పాటు చేసిన మీటింగులో కవితతో పాటు విజయ్ నాయర్, దినేశ్ అరోరా కూడా పాల్గొన్నట్లు తెలిపారు. వాస్తవానికి మీటింగుక తాను హాజరుకాకపోయేవాడినని, కానీ అంశాలను సెట్ చేసింది తానే అయినందున. తన్ననిసరి పరిస్థితుల్లో అటెండ్ కావాల్సి వచ్చిందని. ఏళ్లయ్ వివరించారు. కిక్ బ్యాక్ రూపంలో ఎంత తిరిగొస్తుందో, లాభాలు ఏ స్థాయిలో ఉంటాయో ఈ మీటింగులోనే చర్చించారని ఏళ్లయ్ వెల్లడించారు. ఎజెండా ఎవిడెన్సులు ధ్వంసం. ఈ స్కాచ్లో పరోక్షంగా ప్రమేయం ఉన్న వీ శ్రీనివాసరావు సైతం సెప్టెంబరు 19న ఈడీకి ఇచ్చిన స్టేట్మెంట్లో కల్వకుంట్ల కవిత చెప్పినందునే తాను. కోటి రూపాయలను పెళ్లయ్ కి అందజేసినట్లు తెలిపారు.

కవితకు శ్రీనివాసరావు ఫ్యామిలీ ఫ్రెండ్ అని ఈడీ పేర్కొన్నది. వైఎస్సార్సీపీ ఎంపీ మాగుంట శ్రీశ్రీనివాసులురెడ్డి తరఫున ప్రేమ్ రాహుల్ ఇండో స్పిరిట్స్ వ్యవహారాలను చూసుకున్నట్లు ఈడీ పేర్కొన్నది. మాగుంట శ్రీనివాసులు రెడ్డి కుమారుడు. రాఘవ తరపున తాను డమ్మీ ఏజెంట్ వ్యవహరించినట్లు స్వయంగా ప్రేమ్ రాహుల్ తెలిపారు. శరత్ చంద్రారెడ్డి చేతుల్లో ఉన్న ఐదు రిటైల్ జోన్లను అభిషేక్ నడిపిస్తున్నట్టు ఈడీ పేర్కొన్నది. కల్వకుంట్ల కవిత సహా మొత్తం 36 మంది వాడిన 170 ఫోన్లు, ఈ ఏడాది మే, ఆగస్టు మద్యలో వాటిని మార్చేయడం, డిజిటల్ ఎవిడెన్సులను ధ్వంసం చేయడం తదితర అంశాలన్నింటినీ ఈ చార్జిషీట్లో ఈజ్ పేర్కొన్నది.

సమీర్ మహేంద్రును ఈడీ ఈ కేసులో ‘కింగ్ పిన్’గా పేర్కొన్నందున ఆయనను ఏ-1గా పేర్కొని అభియోగాలను నమోదు చేసింది. వీటికి స్పెషల్ కోర్టు జడ్జి ఆమోదం తెలపడంతో జనవరి 5న ప్రియలకు హాజరయ్యేలా సమన్లు జారీచేయాలని ఈని ఆదేశించారు. సమీర్ మహేంద్రంతో పాటు నాలుగు కంపెనీల ప్రతినిధులను కూడా ఈ ట్రయల్కు హాజరయ్యేలా చూడాలని జడ్జి ఎంకే నాగ్పాల్ పేర్కొన్నందున వాటిలో ఇండో స్పైరిట్స్, ఇండో స్పిరిట్స్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీలు కూడా ఉన్నాయి. వీటిలో కవిత, మాగుంట తరఫున ప్రాతినిధ్యం వహిస్తున్నవారి పేర్లు కంపెనీ రికార్డుల్లో ఉన్నట్లయితే వారు కూడా హాజరు కావాల్సి ఉంటుంది. ఇండో స్పిరిట్స్ కంపెనీ కూడా ఈడీ చార్జిషీట్లో అక్యూడ్జీగా ఉన్నందున ఏ రూపంలో కల్వకుంట్ల కవిత మెడకు చుట్టుకుంటుందనేది. చర్చనీయాంశంగా మారింది. 8 కోట్ల పెట్టుబడికి 70 కోట్ల లాభం ఢిల్లీ ఎక్సయిజ్ పాలసీలో రిటైల్ దుకాణాలను దక్కించుకునేందుకు ఇండో స్పిరిట్స్ పేరుతో పుట్టుకొచ్చిన కొత్త కంపెనీ పెట్టుబడి కేవలం రూ.. 8.40 కోట్లు మాత్రమే. పాలసీ అమలుతో రూ.70 కోట్లు లాభాల రూపంలో వచ్చాయి. ఇందులో రూ. 32.5 కోట్లు కవిత వినామీ అరుణ్ పిళ్లయ్ కి  చేరాయి. బ్యాంకు ఖాతాలోకి రూ.25 కోట్లు కాగా

మిగిలిందంతా క్యాష్! ఈ లాభాల్లో రూ. 1.35 కోట్లు బీఎండబ్ల్యూ కారుకు రూ. 49 లక్షలు. పార్చూనర్ కారుకు, రూ. కోటి ఆంధ్రప్రభ పబ్లికేషను  రూ.70 లక్షలు ఇండియా ఏదక్ చెల్లించినట్లు అరుణ్ ఏళ్లయ్ రద్దీకి ఇచ్చిన స్టేట్ మెంట్ లో పేర్కొన్నారు. మరో రూ. 5 కోట్లు గచ్చి బౌలి సమీపంలోని శ్రీ హెల్ప్ సమీపంలో నాలుగెకరాల భూమిని క్రియేటివ్ డెవలపర్స్ పేరుతో కొనుగోలు చేశారు.

Leave A Reply

Your email address will not be published.