సచివాలయానికి నేడు ఏపి డిప్యూటీ సీఎం

తెలంగాణ జ్యోతి వెబ్ న్యూస్: ఉప ముఖ్యమంత్రి గా ప్రమాణస్వీకారం చేసిన తర్వాత మొదటిసారి సచివాలయానికి పవన్ రాబోతున్నారు. నేటి. మధ్యాహ్నం ఒంటి గంటకు సచివాలయానికి పవన్ చేరుకుంటారు. రెండో బ్లాక్ లోని తన ఛాంబర్ ను పవన్ పరిశీలిస్తారు.

పవన్ కల్యాణ్ అమరావతికి వస్తున్న నేపథ్యంలో ఘనంగా స్వాగతం పలికేందుకు రాజధాని రైతులు సిద్ధమయ్యారు. పవన్ కల్యాణ్ కు మానవహారంతో పూలు చల్లి స్వాగతం తెలిపేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. సచివాలయంలోని తన ఛాంబర్ ను పరిశీలించిన తరువాత సీఎం చంద్రబాబు తో భేటీ కానున్నట్లు సమాచారం.

Leave A Reply

Your email address will not be published.