ఏపి వైసీపీ ఎమ్మెల్సీ అభ్యర్థుల జాబితా విడుదల

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్:  వైసీపీ ఎమ్మెల్సీ అభ్యర్థుల జాబితా విడుదలైంది. ఎమ్మెల్సీ అభ్యర్థుల తుది జాబితాపై ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఆమోద ముద్ర వేశారు. అనంతరం ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి అభ్యర్థుల పేర్లను సోమవారం మీడియా ముఖంగా ప్రకటించారు. మొత్తం 18 మంది ఎమ్మెల్సీ అభ్యర్థుల పేర్లు ఖరారయ్యాయి. అభ్యర్థుల్లో బీసీ 11, ఓసీ 4, ఎస్సీ 2, ఎస్టీ 1 ఉన్నారు. స్థానిక సంస్థల కోటాలో 9 మంది, ఎమ్మల్యే కోటాలో ఏడుగురు, గవర్నర్ కోటాలో ఇద్దరు అభ్యర్థుల పేర్లను సజ్జల వెల్లడించారు.

స్థానిక సంస్థల కోటా అభ్యర్థులు వీరే…

నార్తు రామారావు (బీసీ యాదవఇచ్ఛాపురం)

కుడిపూడి సూర్యనారాయణ (బీసీ శెట్టిబలిజఅమలాపురం)

వెంక రవీంద్రనాథ్ (ఓసీ కాపుతణుకు)

కావూరు శ్రీనివాస్ (బీసీ శెట్టిబలిజపాలకొల్లు)

మేరుగ మురళీధర్ (ఎస్సీ మాలగూడూరు)

సిపాయి సుబ్రహ్మణ్యం (బీసీ వెన్నెరెడ్డిశ్రీకాళహస్తి)

పొన్నపురెడ్డి రామసుబ్బారెడ్డి (ఓసీ రెడ్డిజమ్మలమడుగు)

మధుసూదన్ (బీసీ వాల్మీకిబోయఆదోని)

ఎస్.మంగమ్మ (బీసీ వాల్మీకబోయపెనుగొండ)

ఎమ్మెల్యే కోటా అభ్యర్థులు :

పెన్మత్స సూర్యనారాయణరాజు (ఓసి క్షత్రియనెల్లిమర్ల)

పోతుల సునీత (బీసీ పద్మశాలిచీరాల)

కోలా గురువులు (బీసీ వడబలిజవిశాఖ సౌత్)

బొమ్మి ఇజ్రాయిల్ (ఎస్సీ మాదిగఅమలాపురం)

జయమంగళ వెంకటరమణ (బీసీ వడ్డీకైకలూరు)

చంద్రగిరి ఏసురత్నం (బీసీ వడ్డెరగుంటూరు వెస్ట్)

మర్రి రాజశేఖర్ (ఓసీ కమ్మచిలకలూరిపేట)

గవర్నర్ కోటా అభ్యర్థులు

కుంభా రవిబాబు (ఎస్టీ ఎరుకులఅరకు)

కర్రి పద్మశ్రీ (బీసీ వాడబలిజ (మత్సకార)కాకినాడ సిటీ)

Leave A Reply

Your email address will not be published.