రాజకీయాలకు అతీతంగా ప్రజా సంక్షేమం కై పాటుపడాలి

- మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కరరావు

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: ప్రజలందరూ సుఖ సంతోషాలతో జీవించాలని తెలుగు రాష్ట్రాలు భారతదేశం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలని నూతన సంవత్సర సందర్భంగా  శుభాకాంక్షలు తెలిపారు. గురువారం జూబ్లీహిల్స్ లోని నాదెండ్ల భాస్కరరావు గారి స్వగృహం సర్వధర్మ నిలియంలో ఇండియన్ ప్రజా కాంగ్రెస్ పార్టీ బృందం ఆధ్వర్యంలో నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన సందర్భంగా నాదెండ్ల భాస్కర్ రావు గారు ప్రజలకు నూతన సంవత్సర సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుతూ రాజకీయ పార్టీలు రాజకీయాలకు అతీతంగా ప్రజా సంక్షేమం కై పాటుపడాలని సూచించారు కార్యక్రమంలో ఇండియన్ ప్రజా కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులు కేబి శ్రీధర్ తెలంగాణ స్టేట్ జనరల్ సెక్రెటరీ వాసుదేవరావు ఉపాధ్యక్షుడు దశరథం మైనారిటీ విభాగం ప్రధాన కార్యదర్శి నసీర్ భాష గ్రేటర్ హైదరాబాద్ యువజన విభాగం అధ్యక్షుడు నవీన్ ప్రోటోకాల్ ఇంచార్జ్ ఎం వి ఎస్ చౌదరి కార్యవర్గ సభ్యులు చిత్ర అరుణ రెడ్డి వాణి రాజు సంఘ సేవకురాలు విజయదేవి తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.