నర్సరీలను సందర్శించిన ఏపీఓ
తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్/కంగ్టి ప్రతినిధి: సంగారెడ్డి జిల్లా కంగ్జి మండల పరిధిలోని తడ్కల్ పరిసర పలు గ్రామాలలో నర్సరీలను సందర్శించిన ఏపీవో బస్వరాజ్, నర్సరీలలో పెంచె చెట్లను సరియైన సమయానికి నీళ్లు పట్టాలని నర్సరీలలో గడ్డి పెరగనివ్వకుండా చూడాలని నర్సరీలో నాటిన చెట్లు చనిపోకుండా చూసుకోవాలని ఆయా గ్రామాల ఫీల్డ్ అసిస్టెంట్లను సూచించారు. ఈ సంవత్సరం నర్సరీ ల్యాండ్రేట్ డబ్బులు నెలాఖరులోగా పడతాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ గడ్డపు మనోహర్, పంచాయతీ కార్యదర్శి జ్ఞానదేవ్, ఫీల్డ్ అసిస్టెంట్ విష్ణు దాస్, నర్సరీ భూ యజమాని పెద్ద మల్లారెడ్డి, జలీల్, పాల్గొన్నారు.