గిరిజన గురుకులంలో స్టాఫ్ నర్స్ పోస్ట్ కు దరఖాస్తుల ఆహ్వానం
తెలంగాణ జ్యోతి/ వెబ్ న్యూస్: కామారెడ్డి జిల్లా బాన్సువాడ నియోజకవర్గంలోని నసురుల్లాబాద్ మండల కేంద్రంలో గల గిరిజన సంక్షేమ గురుకుల బాలుర విద్యాలయంలో అవుట్సోర్సింగ్ పూర్తి తాత్కాలిక పద్ధతి పై స్టాఫ్ నర్స్ పోస్టు భర్తీకి ఆసక్తి గల అభ్యర్థులు ఫిబ్రవరి 7వ తేదీ లోపు దరఖాస్తు చేసుకోవాలని ఆ సంస్థ రీజనల్ కోఆర్డినేటర్ టి సంపత్ కుమార్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. బీఎస్సీ నర్సింగ్ లేదా జిఎన్ఎమ్ అర్హత గల అభ్యర్థులు నసురుల్లాబాద్ లోని బాన్సువాడ గిరిజన గురుకులంలో తమ దరఖాస్తులు సమర్పించాలని జిల్లా కలెక్టర్ ఆమోదంతో పూర్తి మెరిట్ ఆధారంగా తాత్కాలిక పద్ధతిన అభ్యర్థులను ఎంపిక చేయడం జరుగుతుందని తెలిపారు పూర్తి వివరాల కొరకు 8333925398 నెంబర్లు సంప్రదించాలని కోరారు.