ప్రజా పాలనలో దేవుళ్ళ పేరుతో దరఖాస్తులు

తెలంగాణ జ్యోతి వెబ్ న్యూస్: తెలంగాణ రాష్ట్రంలో ప్రజా పాలనకు ప్రజల నుంచి విశేష స్పందన వచ్చింది. భారీ స్థాయిలో దరఖాస్తులు వచ్చాయి. వరంగల్ జిల్లాలో మాత్రం ఓ వింత జరిగింది. ఏకంగా దేవుళ్ల పేరుతో దరఖాస్తు చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది.

 

శివయ్య అంటూ

 

భీమదేవరపల్లి మండలం ముత్తారానికి చెందిన ఏనుగు వెంకట సురేందర్ రెడ్డి ఆ విధంగా దరఖాస్తు చేశారు. తన పేరును ఫామ్‌లో శివయ్యగా రాసుకున్నారు. భార్య పేరు పార్వతీదేవి అని కుమారుల పేర్లు కుమారస్వామి వినాయకుడిగా రాశారు. శివుని వయస్సును 1200 ఏళ్లుగా పేర్కొన్నారు. దానిని అధికారులు చూశారో లేదో.. తెలియదు, రసీదు మాత్రం ఇచ్చారు. ఆ దరఖాస్తు ఫొటో తీసి ఒకరు సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఇంకేముంది తెగ చక్కర్లు కొడుతుంది

Leave A Reply

Your email address will not be published.