విద్యుత్ కమిషన్ కు కొత్త చైర్మన్ ను నియమించండి

తెలంగాణ జ్యోతి వెబ్ న్యూస్: తెలంగాణలో విద్యుత్ కొనుగోళ్లు, పవర్ ప్లాంట్ల నిర్మాణాలపై రేవంత్ రెడ్డి ప్రభుత్వం జస్టిస్‌ ఎల్ నరసింహా రెడ్డి కమిషన్‌ను ఏర్పాటు చేయడాన్ని సవాల్‌ చేస్తూ బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌ సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ పిటిషన్‌పై సుప్రీం కోర్టు ఇవాళ విచారణ చేపట్టంది. సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్‌ జేబీ పార్దీవాలా, జస్టిస్‌ మనోజ్‌ మిశ్రాలతో కూడిన త్రిసభ్య ధర్మాసనం ఎదుట ఇరుపక్షాల వాదనలు వినిపించారు. పిటిషనర్ తరుపు ముకుల్ రోహత్గి, తెలంగాణ ప్రభుత్వం తరఫున సిద్ధార్థ లూథ్రా, కమిషన్‌ తరఫున గోపాల్‌శంకర్‌ నారాయణన్‌ తమ తమ వాదనలు వినిపించారు.ఇది పూర్తిగా రాజకీయ కక్షతో వేసిన కమిషన్ అని ముకుల్ రోహత్గీ ధర్మాసనానికి తెలిపారు. రాష్ట్రాల్లో ప్రభుత్వం మారిన ప్రతిసారి మాజీ సీఎంలపై కేసులు నమోదు చేయడం ఇటీవల కాలంలో పరిపాటిగా మారిందన్నారు. విద్యుత్ విచారణ కమిషన్ నియామకంలో ప్రభుత్వం పరిధిని అతిక్రమించిందన్నారు. ట్రిబ్యునల్స్ ఉండగా, విద్యుత్ కొనుగోలు ఒప్పందాలపై ఎలా న్యాయ విచారణ చేస్తారన్నారు. కొత్త రాష్ట్రం, విద్యుత్ సంక్షోభం నేపథ్యంలో విద్యుత్ కొనుగోలు చేసినట్లు చెప్పారు. మార్కెట్ రేట్ కంటే తక్కువగా తాము యూనిట్ 3.90 రూపాయలకే కొనుగోలు చేశామన్నారు. ఇది కక్ష సాధింపు చర్య అని విచారణకు ముందే కమిషన్ ఛైర్మన్ నరిసింహా రెడ్డి ప్రెస్‌మీట్ పెట్టి దోషిగా తేల్చారాని వాదించారు. ఈఆర్సీ ఉండగా.. మళ్లీ విచారణ కమిషన్ అవసరం లేదన్నారు. ప్రభుత్వం తరపున వాదనలు వినిపించిన లుథ్రా.. ప్రెస్ మీట్‌లో కేవలం ఎంక్వైరీ స్టేటస్ మాత్రమే చెప్పారని వెల్లడించారు. దేశవ్యాప్తంగా పవర్ ప్రాజెక్టులు అన్ని సూపర్ క్రిటికల్ టెక్నాలజీతో నిర్మిస్తుంటే.. భద్రాద్రి సబ్ క్రిటికల్ టెక్నాలజీతో నిర్మించారన్నారు. దీంతో ప్రభుత్వ ఖజానాకు వ్యయం భారీగా పెరిగిందన్నారు.ఇరు పక్షాల వాదనలు విన్న సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ చంద్రచూడ్ కీలక వ్యాఖ్యలు చేశారు. విద్యుత్ కమిషన్ ఛైర్మన్ ప్రెస్‌మీట్ ఎలా పెడతారని ప్రభుత్వ న్యాయవాదిని ప్రశ్నించారు. కమిషన్ ఛైర్మన్ ప్రెస్‌మీట్ పెట్టడాన్నని సీజేఐ తప్పుబట్టారు. కమిషన్ తన అభిప్రాయాలను ఎలా వ్యక్తం చేస్తారని ప్రశ్నించారు. కమిషన్ ఛైర్మన్ న్యాయం చెప్పటమే కాకుండా నిస్పక్షపాతంగా వ్యవహరించాలన్నారు. కమిషన్‌ నుంచి నరసింహా రెడ్డిని తప్పించి కొత్త ఛైర్మన్‌ను నియమించాలన్నారు

Leave A Reply

Your email address will not be published.