ఆ ముగ్గురు చనిపోయారా? లేక వారిని చంపేశారా?

- ఇదంతా వైసీపీ స్లీపర్‌ సెల్స్‌ చేస్తున్న కుట్ర: వర్ల రామయ్య

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: చంద్రన్న కానుక ఓ ఎన్నారై సదుద్దేశంతో చేపట్టిన కార్యక్రమమని, పోలీసుల అనుమతితోనే ఈ కార్యక్రమం నిర్వహణ జరిగిందని టీడీపీ సీనియర్ నేత వర్ల రామయ్య అన్నారు. సోమవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ పోలీసులు ముందుగానే వచ్చి సభా స్థలాన్ని పరిశీలించారని, అన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఈ దుర్ఘటన ఎలా జరిగిందని ప్రశ్నించారు. ఆ ముగ్గురు చనిపోయారా? లేక వారిని చంపేశారా? అన్న అనుమానం కలుగుతోందన్నారు. ఆ కుట్ర కోణాన్ని సీఎం జగన్‌ బహిర్గతం చేయాలన్నారు. వాళ్లను సీఎం, ఆయన పార్టీ నేతలు కలిసి చంపేశారని ఆరోపించారు. చంద్రబాబు సభలకు ప్రజాదరణ చూసి ఓర్వలేకపోతున్నారని, ఇదంతా వైసీపీ స్లీపర్‌ సెల్స్‌ చేస్తున్న కుట్రలని వర్ల రామయ్య వ్యాఖ్యానించారు.

Leave A Reply

Your email address will not be published.