ఉద్యమకారులలో నువ్వున్నావా?

.. వైఎస్ షర్మిళ

తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్తె తెలంగాణ ఉద్యమంలో నువ్వెక్కడా ? అంటూ వైఎస్ షర్మిల సెటైర్లు పేల్చారు. ట్విట్టర్ వేదికగా మంత్రి కేటీఆర్ కు కౌంటర్ వేశారు వైఎస్ షర్మిల. వచ్చిన తెలంగాణలో కొట్లాడిన ఉద్యమకారులను ఆదుకోవడంలో నువ్వెక్కడ? నీ జాడెక్కడ? అంటూ నిలదీశారు. కొలువుల కోసం ఆత్మహత్య చేసుకొన్న నిరుద్యోగ కుటుంబాలను ఆదుకోవడంలో నువ్వెక్కడ? నీ జాడెక్కడ ? అని ప్రశ్నించారు. పంటలు నష్టపోయి ఆత్మహత్య చేసుకున్న రైతులను ఆదుకోవడంలో నువ్వెక్కడ?నీ జాడెక్కడ? పోడు పట్టాల కోసం ఆదివాసీల మీద దాడులు జరిగితే నువ్వెక్కడ?నీ జాడెక్కడ? అని ఓ రేంజ్ లో ఫైర్ అయ్యారు. వరద ప్రాంతాలను సందర్శించి, రోడ్డున పడ్డ కుటుంబాలకు సాయం అందించడంలో నువ్వెక్కడ? నీ జాడెక్కడ? దీక్షలు చేసే విఆర్ఎ ల పోరాటంలో ఉపాధ్యాయుల స్పౌజ్ బదిలీల పోరాటంలో నువ్వెక్కడ?నీ జాడెక్కడ? అని నిప్పులు చెరిగారు. కరోనాతో కుటుంబపెద్దను కోల్పోయిన కుటుంబాలను ఆదుకోవడంలో నువ్వెక్కడ?నీ జాడెక్కడ? అధికారంలో ఉండి సమస్యలు పరిష్కరించకుండా, జనాన్ని చచ్చేలా చేస్తున్న కేటీఆర్ గారు మీరా?అని ఓ రేంజ్ లో ఫైర్ అయ్యారు. నన్ను నువ్వెక్కడా అని ప్రశ్నించేది?అధికారం లేకున్నా ప్రజలకు అండగా ఉండటంలో నేనున్నా అంటూ షర్మిల భరోసా కల్పించారు. రాష్ట్ర ప్రజలు ఇకపై ధైర్యంగా ఉండాలని భరోసా కల్పించారు.

Leave A Reply

Your email address will not be published.