భాజపా కార్యకర్తల అరెస్టు అమానుషం
తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: భాజపా కార్యకర్తల అరెస్టు అమానుషం అని బిజెపి నాయకులు బిఆర్ఎస్ పార్టీపై మండిపడ్డారు. నిన్న కెసిఆర్ పర్యటన దృష్టిలో పెట్టుకొని భారతీయ జనతా పార్టీ కార్యకర్తలను అరెస్ట్ చేయడానీ తీవ్రంగా ఖండిస్తున్నామని బిజెపి నాయకులు మండిపడ్డారు. బాన్సువాడ నియోజకవర్గంలో బిఆర్ఎస్ పార్టీ భారతీయ జనతా పార్టీ కార్యకర్తలను అరెస్టు చేస్తే కానీ కార్యక్రమం నిర్వహించుకునే స్థితిలో లేరు బాన్సువాడ మరియు జుక్కల్ నియోజకవర్గం ప్రజల కోరిక మేరకు బాన్సువాడ నియోజకవర్గం కేంద్రాన్ని జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేయాలని కోరుకుంటున్నారు ఈ విషయాన్ని సీఎం కేసీఆర్ కు తెలియకుండా ఉండడానికి స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలను ముందస్తు అరెస్టు చేయించడం జరిగింది భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఈ విషయాన్ని కేసీఆర్ కి విన్నవించకుండా మిమ్మల్ని అరెస్టు చేశారు ఇప్పటికైనా కేసీఆర్ చేత బాన్సువాడను జిల్లా కేంద్రంగా ప్రకటన చేయించాలని డిమాండ్ చేస్తున్నాం అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ పైడిమల లక్ష్మీనారాయణ, బాన్సువాడ పట్టణ అధ్యక్షులు గొడుగుట్ల శ్రీనివాస్, నసురుల్లాబాద్ మండల అధ్యక్షులు చందూరి హన్మాండ్లు, తుప్తి శివప్రసాద్,నాగరాజు, శేఖర్, laxman, బాలరాజు, దత్తు తదితరులు పాల్గొన్నారు