బిఎస్ఏ ఉమెన్స్ లీడర్షిప్ నేషనల్ అవార్డుకు అరుణ జ్యోతి ఎంపిక

తెలంగాణ జ్యోతి /  వెబ్ న్యూస్: బహుజన సాహిత్య అకాడమీ (బి ఎస్ ఏ) ఉమెన్స్ లీడర్షిప్ నేషనల్ అవార్డు 20 22 గాను మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా దళిత సంఘర్షణ సమితి అధ్యక్షురాలు యు. అరుణ జ్యోతి ఎంపికైనారు. ఈ మేరకు బిఎస్ఏ జాతీయ అధ్యక్షులు నల్లా రాధాకృష్ణ ఆమెకు ఆహ్వాన పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నవంబర్ 13వ తేదీన దేశ రాజధాని న్యూఢిల్లీలో జరిగే ఆలిండియా బహుజన రైటర్స్ మూడవ నేషనల్ కాన్ఫరెన్స్ సందర్భంగా అరుణ జ్యోతి కి ఉమెన్స్ లీడర్షిప్ అవార్డును ప్రధానం చేయునట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమానికి దేశంలోని 26 జిల్లాల నుండి సుమారు 2000 మంది ప్రతినిధులు హాజరావుతున్నర్ట్లు  రాధాకృష్ణ వెల్లడించారు. కాగా ఇందుకు సహకరించిన నేషనల్ హ్యూమన్ రైట్స్ ఫెడరేషన్ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు అంజలి ఖాదర్ కు అరుణ జ్యోతి కృతఙ్ఞతలు తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.