తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: ముఖ్యమంత్రి కేసీఆర్ మంత్రి కేటీఆర్ పై బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ చేసిన వ్యాఖ్యలపై పీయూసీ చైర్మన్ జీవన్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. మీడియాతో మాట్లాడుతూ… రాజకీయాల్లో నిజామాబాద్ ఎంపీ అరవింద్ ఓ కుసంస్కారి అని అన్నారు. అరవింద్ తాగే నీళ్లు కేసీఆర్ వే.. నడిచే రోడ్డు కేసీఆర్ వేసిందే అన్నారు. అరవింద్ అడ్డగాడిదలా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. కేటీఆర్ దావోస్ వెళ్లి ఏం చేశారో అరవింద్కు తెలియదా అని ప్రశ్నించారు. ఐటీ గురించి అరవింద్ లాంటి లూటీ గాళ్లకు ఏం తెలుసని యెద్దేవా చేశారు. అబద్దాలు మాట్లాడితే అరవింద్ నాలుక చీరేస్తామని ఆయన హెచ్చరించారు.‘‘అరవింద్… నిజామాబాద్ జిల్లా అభివృద్ధిపై చర్చకు వస్తావా? ఎక్కడైనా చర్చకు నేను సిద్ధం’’ అని సవాల్ విసిరారు. కరెంటు లేదంటున్న అరవింద్.. ఓ సారి కరెంటు తీగలను పట్టుకోవాలని సూచించారు. ఈటెల రాజేందర్ అడ్డగోలుగా మాట్లాడితే ప్రజలు తరుముతారన్నారు. నిజామాబాద్ అభివృద్ధిపై ఈటెలతో కూడా చర్చకు సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు. నందిపేటలో సర్పంచ్ దంపతుల ఆత్మహత్యాయత్నం బీజేపీ కుట్ర అని ఆరోపించారు. బిల్లులు రాలేదనే కారణంతో వాళ్ళు ఆందోళన చేయలేదని.. ఎదో టెన్షన్లో అలా చేశానని ఆ సర్పంచ్ తర్వాత చెప్పారని జీవన్ రెడ్డి వెల్లడించారు.