6 న ఆర్యవైశ్య మహాసభ ఆద్వర్యం లో అష్టలక్ష్మి సమేత మహాలక్ష్మి కమల పుష్పార్చన

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: హైదరాబాద్ జిల్లా ఆర్యవైశ్య మహాసభ, ఆర్యవైశ్య సంఘం డబీర్ పుర, హైదరాబాద్ జిల్లా ఆర్యవైశ్య మహాసభ మహిళా విభాగం సహకారంతో శ్రీ అష్టలక్ష్మి సమేత మహాలక్ష్మి కమల పుష్పార్చన కార్యక్రమం నిర్వహించనున్నట్లు ఆ సంస్థ అధ్యక్షులు సరబు లక్ష్మణ్ గుప్తా తెలిపారు. ఈ మేరకు గురువారం ఎన్ఎస్ఎస్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కార్యక్రమ కరపత్రాన్ని ఆవిష్కరించి మాట్లాడారు. ఈనెల 6 వ తేదీ ఆదివారం ఉదయం తొమ్మిది గంటలకు ఖైరతాబాద్ లోని శ్రీ వాసవి కళ్యాణ మండపం లో అధికమాసం సందర్భంగా సామూహికంగా శ్రీ మహాలక్ష్మి అమ్మవారికి లక్ష కమలం పూలతో అర్చన కార్యక్రమం 121 మంది దంపతులచే నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా శ్రవణ స్వామి ఆధ్వర్యంలో భాస్కర యోగి చే ప్రవచనం  ఉంటుందని తెలియజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్సీ బోగ్గరపు దయానంద్ గుప్తా, కొలేటి దామొదర్ గుప్త లతో పాటు పెద్ద ఎత్తున వివిధ బస్తి సంఘాల నేతలు పాల్గొంటారని తెలిపారు. ఈ సమావేశంలో సంఘం ప్రధాన కార్యదర్శి కటకం శివకుమార్ గుప్తా కోశాధికారి లింగ ప్రకాష్ గుప్తా దయాకర్ గుప్తా వెంకటేశ్వర్లు సత్యం గుప్తా శ్రీ రామ్ గుప్తా శ్రీనివాస్ రావు వెంకట గోపాలకృష్ణ స్వర్ణలత శ్రీనివాస్ తాడిశెట్టి పశుపతి తలకొండ రమేష్ తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.