ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కనీసం రెండు అసెంబ్లీ స్థానాల్లో బీసీలకు కేటాయించాలి

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కనీసం రెండు అసెంబ్లీ స్థానాల్లో బీసీలకు అవకాశం కల్పించాలని కోరుతూ బిజెపి జిల్లా అధ్యక్షులు , బిఎస్పి జిల్లా అధ్యక్షులు , తెలుగుదేశం జిల్లా పార్టీ నాయకులకు జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఖమ్మం జిల్లా అధ్యక్షులునారాయణవరపు శ్రీనివాసరావు వినతి పత్రం సమర్పించారు.స్థానిక ఖమ్మం కేంద్రంగా భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షులు గెల్లా సత్యనారాయణ, బీఎస్పీ పార్టీ జిల్లా అధ్యక్షులు ఉపేంద్ర సాహూ, తెలుగుదేశం పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి కేతినేని హరిచంద్ర, జిల్లా ఉపాధ్యక్షులు కొండబాల కేశవరావు గార్లకు జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఖమ్మం జిల్లా అధ్యక్షులు నారాయణవరపు శ్రీనివాస్ ఆధ్వర్యంలో   బి సి సంఘ నాయకులు  మొత్తం ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మూడు అసెంబ్లీ ఒక పార్లమెంట్ స్థానం జనరల్ ఉండగా కనీసం ఉమ్మడి జిల్లా లో బీసీలకు రెండు అసెంబ్లీ స్థానాలు కేటాయించాలని కోరుతూ వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా  రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మోడేపల్లి కృష్ణమాచారి,జిల్లా అధ్యక్షులు నారాయణవరపు శ్రీనివాస్ మాట్లాడుతూ… జనాభాలో 56 శాతం ఉన్న బీసీలకు జిల్లాలో కనీస ప్రాధాన్యత లేకపోవడం దురదృష్టకరమని ఈసారి ప్రధాన పార్టీలన్నీ కూడా బీసీలకు రెండు సీట్లు కేటాయించాల్సిందేనని డిమాండ్ చేశారు.ఎ రాజకీయ పార్టీ అయితే ఎక్కువ సీట్లు బీసీల కేటాయిస్తుందో వారి వెంట బీసీలు నడుస్తారని వారు అన్నారు. ఈ కార్యక్రమంలో  జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ లింగనబోయిన  పుల్లారావు మహిళ విభాగం జల్లా నాయకురాలు శ్రీమతి సుగుణ , జిల్లా కార్యదర్శి చల్లా హనుమంతు,  సత్తుపల్లి మండల అధ్యక్షులు పామర్తి నాగేశ్వరరావు, తదితరులు పాల్గొన్నారు..

Leave A Reply

Your email address will not be published.