జమ్మూకశ్మీర్లోకి చొరబడేందుకు ఉగ్రవాదుల యత్నం
- నలుగురు ఉగ్రవాదులను మట్టుబెట్టిన భద్రతా బలగాలు
తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: జమ్మూకశ్మీర్లోకి చొరబడేందుకు ఉగ్రవాదులు చేసిన యత్నాలను భద్రతా బలగాలు శుక్రవారంనాడు విజయవంతంగా తిప్పికొట్టాయి. నలుగురు ఉగ్రవాదులను మట్టుబెట్టాయి. పాక్ ఆక్రమిత కశ్మీర్ నుంచి మన భూభాగంలోకి చొరబడేందుకు ప్రయత్నించిన నలుగురు ఉగ్రవాదులను ఆర్మీ , పోలీసులతో కూడిన సంయుక్త బృందం మట్టుబెట్టినట్టు కశ్మీర్ జోన్ పోలీసులు ఒక ట్వీట్లో తెలిపారు. గత శుక్రవారంనాడు కూడా భద్రతా బలగాలు చొరబాటుదారుల యత్నాలను తిప్పికొట్టాయి. కెరాన్ సెక్టార్లోని జుమాగుండ్ ప్రాంతంలో ఐదుగురు ఉగ్రవాదులను బలగాలు కాల్చిచంపాయి.మరోవైపు, కేంద్ర హోం మంత్రి అమిత్షా జమ్మూలో పర్యటిస్తు్న్నారు. ఒకరోజు పర్యటన కోసం జమ్మూ చేరుకున్న అమిత్షాకు లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా, కేంద్ర మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ స్వాగతం పలికారు.