బీర్కూర్ పెట్రోల్ బ్యాంకులో చోరీకి యత్నం
- దుండగులకు దేహశుద్ది .. పోలీసులకు అప్పగింత
తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్/బీర్కూర్: కామారెడ్డి జిల్లా.. బీర్కూర్ పెట్రోల్ బoకులో గురువారం రాత్రి ఇద్దరు వ్యక్తులు చొరబడి నగదు అపహరణ కు యత్నించారు. అడ్డు వచ్చిన యువకుడిని రాయి తో తల పై దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. పారిపోతున్న వారిని పట్టుకునేo దుకు వచ్చిన స్థానికులపై కత్తులతో దాడికి యత్నించారు. దీంతో స్థానికులు దొంగలను పట్టు కొని దేహశుద్ది చేసి పోలీసులకు అప్పగించారు. నగదు చోరీకి యత్నించిన వీరు బాన్సువాడ పట్టణానికి చెందిన సందీప్ రెడ్డి, సోమేశ్వర్ కు చెందిన సంతోష్ లు గా పోలీసులు గుర్తిoచి వారిని అదుపులోకి తీసుకున్నారు.