ఔర్..తీన్ దిన్.. తెలంగాణలో దంచికొడుతున్న ఎండలు
తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: తెలంగాణలో ఎండలు దంచికొడుతున్నాయి. రాగల మూడు రోజులు ఎండలు కొనసాగుతాయని వాతావరణ శాఖ తెలిపింది. పలు జిల్లాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని పేర్కొంటూ ఎల్లో అలెర్ట్ను జారీ చేసింది. బుధవారం నుంచి గురువారం ఉదయం వరకు కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, వరంగల్, హన్మకొండ, జనగాం, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్గిరి, వికారాబాద్, సంగారెడ్డి, మహబూబ్నగర్, నాగర్కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో వర్షాలు కురిసే అవకాశాలున్నాయని తెలిపింది.అదే సమయంలో ఆదిలాబాద్, కుమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, వరంగల్, హన్మకొండ, మెదక్ జిల్లాల్లో అక్కడక్కడ వడగాలు వీస్తాయని పేర్కొంది. గురువారం ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, వరంగల్, హన్మకొండ జిల్లాల్లో.. శుక్రవారం ఉమ్మడి ఆదిలాబాద్, వరంగల్, నల్గొండ, జిల్లాలతో పాటు జగిత్యాల, పెద్దపల్లి, ఖమ్మంలోని పలు ప్రాంతాల్లో వడగాల్పులు వీస్తాయని తెలిపింది. ఈ మేరకు ఎల్లో అలెర్ట్ను జారీ చేసింది.