ఆటో వాళ్లు తమ సోదరులే ..వాళ్లకు ఖచ్చితంగా న్యాయం చేస్తాం

తెలంగాణ జ్యోతి వెబ్ న్యూస్:  ప్రజాభవన్‌లో నిర్వహించిన ప్రజావాణి కి మంచి స్పందన వచ్చిందని రవాణాబీసీ సంక్షేమ శాక మంత్రి పొన్నం ప్రభాకర్‌ అన్నారు.ఈ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి మీడియా పాయింట్‌లో వివరాలను వెల్లడించారు. మంగళవారం 5,126 దరఖాస్తులు వచ్చాయ తెలిపారు. అందులో ఎక్కువ అప్లికేషన్లు డబుల్ బెడ్‌ రూం ఇండ్ల కోసం వచ్చాయని పేర్కొన్నారు.నిరుద్యోగులు కూడా ఎక్కువ సంఖ్యలో వచ్చారని తెలిపారు. వాళ్ల సమస్యలు ఖచ్చితంగా పరిష్కారం చేస్తామని స్పష్టం చేశారు. మహిళలకు ఇచ్చిన హామీ ప్రకారం ఫ్రీ బస్ అమలు చేస్తున్నాం. బస్సుల్లో ఉచిత ప్రయాణం వల్ల ఆటో వాళ్లు ఇబ్బంది పడుతున్నారని.. ఆ విషయం తమ దృష్టికి వచ్చిందన్నారు. ఆటో వాళ్లు తమ సోదరులే అని..వాళ్లకు ఖచ్చితంగా న్యాయం చేస్తామన్నారు. సమస్య పరిష్కరించేవరకు ఓపికగా ఉండాలని మంత్రి కోరారు.

Leave A Reply

Your email address will not be published.