అయ్యల సంతోష్ కు ఉపాద్యాయసంగం ఆధ్వర్యంలో సన్మానం

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: ఉపాద్యాయ వృత్తితో పాటు సామాజిక రంగంలో సేవలందిస్తున్న ప్రభుత్వ ఉపాద్యాయుడు అయ్యల సంతోష్ ఢిల్లీలో డాక్టరేట్ తీసుకున్న సందర్భంగా SC, ST ఉపాద్యాయ సంఘం బాన్సువాడ శాఖ ఆధ్వర్యంలో సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేశారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా మండల విద్యాశాఖధికారి నాగేశ్వరరావు గారు హాజరై మాట్లాడుతూ అయ్యల సంతోష్ చేస్తున్న కార్యక్రమాలు విద్యా పరంగా ఎక్కువగా ఉండి, డ్రాప్ ఔట్ విద్యార్థులను చేర్పించడం,పేద విద్యార్థుల విద్యాభివృద్ధికి తోడ్పాటునందించడం అభినoదనీయం, సమాజానికి ఉపయోగపడే మరెన్నో కార్యక్రమాలను నిర్వహించాలని,మా వంతు సహాయ సహకారాలు ఎల్లప్పుడూ ఉంటాయని అన్నారు.అనంతరం MEO నాగేశ్వరరావు, ఉపాధ్యాయులతో అయ్యల సంతోష్ ను సన్మానించారు. ఈ కార్యక్రమంలో కోన బాన్సువాడ ప్రధానోపాధ్యాయులు కొంతం వెంకటేశ్వర్లు,జెట్టి రవీందర్,బాన్సువాడ మండల అధ్యక్షుడు లకావత్ లఖ్య,ప్రధాన కార్యదర్శి రామవత్ గోపి,కోశాధికారి వసంత్,చంద్రశేఖర్, శంకర్,గణపతి,దశరత్,ఆమర్సింగ్, బ్రహ్మం తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.