బాచుప‌ల్లి ఘోరం..స్కూటీపై వెళ్తున్న తండ్రీకూతుళ్ల‌ను బస్సుడీ..చిన్నారి మృతి

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: బాచుప‌ల్లి పోలీసు స్టేష‌న్ ప‌రిధిలో ఘోరం జ‌రిగింది. స్కూటీపై వెళ్తున్న తండ్రీకూతుళ్ల‌ను వేగంగా వ‌చ్చిన స్కూల్ బ‌స్సు అదుపుత‌ప్పి ఢీకొట్టింది. చిన్నారిపై నుంచి బ‌స్సు దూసుకెళ్లింది. బాలిక అక్క‌డిక‌క్క‌డే మృతి చెంద‌గాతండ్రికి గాయాల‌య్యాయి. స‌మాచారం అందుకున్న పోలీసులు ఘ‌ట‌నాస్థ‌లానికి చేరుకుని ద‌ర్యాప్తు చేప‌ట్టారు.బాచుప‌ల్లి ఇందిరా న‌గ‌ర్‌లో నివాస‌ముంటున్న కిశోర్ అనే వ్య‌క్తి త‌న కుమార్తె దీక్షిత‌(8)ను బౌరంపేట‌లోని ఢిల్లీ ప‌బ్లిక్ స్కూల్‌కు తీసుకెళ్తుండ‌గా ఈ ప్ర‌మాదం జ‌రిగిన‌ట్లు పోలీసులు తెలిపారు. దీక్షిత మూడో త‌ర‌గ‌తి చ‌దువుతుంది. చిన్నారి కుటుంబ స‌భ్యులు శోక‌సంద్రంలో మునిగిపోయారు. కిశోర్‌ను చికిత్స నిమిత్తం ఆస్ప‌త్రికి త‌ర‌లించారు.

Leave A Reply

Your email address will not be published.