తన మొబైల్ పోయిందని పోలీసులకు ఫిర్యాదు చేసిన బండి
తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ఫోన్ మిస్ అయింది. ఈ మేరకు ఆయన ఆదివారం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఆన్లైన్ ద్వారా కరీంనగర్ టూ టౌన్ పోలీసులకు కంప్లైంట్ ఇచ్చారు. తన ఫోన్ కనబడటం లేదని, అరెస్ట్ చేసే క్రమంలో పడిపోయిందంటూ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఫోన్లో కీలక సమాచారం ఉందని వెల్లడించారు. తన ఫోన్ను వెతికిపెట్టాలని పోలీసులను కోరారు.
పోలీసుల వద్దే తన ఫోన్ ఉందని, జైలు నుంచి రిలీజ్ అయిన తర్వాత తన ఫోన్తో పోలీసులకు ఏం పని? అంటూ బండి సంజయ్ ప్రశ్నించారు. తనను కరీంనగర్లో అరెస్ట్ చేసి సిద్దిపేటకు తీసుకెళ్లే సమయంలో పోలీసుల వెహికల్లో తన ఫోన్ మిస్ అయిందని కంప్లైంట్లో పొందుపర్చారు. పోలీసుల దగ్గరే తన ఫోన్ ఉందని, పోలీసుల మీదే తనకు అనుమానం ఉందన్నారు. తన ఫోన్ను వెంటనే తనకు అప్పగించాలని కోరారు. ఆధారాలు సేకరించేందుకు తన ఫోన్ను పోలీసులు తీసుకున్నారని, పోలీసులకు కూడా ఈ విషయం తెలుసని బండి సంజయ్ అంటున్నారు. తన ఫోన్ మిస్సింగ్పై అప్పుడే తాను పోలీసులకు సమాచారం ఇచ్చానని అన్నారు. పోలీసులు తన ఫోన్ను అప్పగించడం లేదని, విచారణకు సహకరించడం లేదని కోర్టులో ఆరోపించారని అన్నారు. పోలీసులే తన ఫోన్ను లాక్కున్నారని అంటున్నారు. 7680006600 నంబర్ గల తన ఐ ఫోన్ మిస్ అయిందని, సిద్దిపేట వరకు ఉన్న ఐ ఫోన్ తర్వాత ఎక్కడికి పోయిందో తెలియదన్నారు. అయితే ఇటీవల టెన్త్ హిందీ ప్రశ్నాపత్రాన్ని వాట్సప్లో షేర్ చేసిన కేసులో బండిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మంగళవారం అర్థరాత్రి కరీంనగర్లోని ఆయన ఇంట్లోకి ప్రవేశించిన పోలీసులు.. అరెస్ట్ చేసి తీసుకెళ్లారు. బలవంతంగా పోలీస్ వెహికల్లోకి ఎక్కించి యాదాద్రి భువనగిరి జిల్లాలోని బొమ్మలారామారం పోలీస్ స్టేషన్కు తరలించారు. ఈ కేసులో ఆయనను కోర్టు ముందు ప్రవేశపెట్టగా.. కోర్టు రిమాండ్ విధించడంతో కరీంనగర్ జిల్లా కోర్టుకు తరలించారు. అయితే హనుమకొండ కోర్టు బెయిల్ మంజూరు చేయడంతో శుక్రవారం ఉదయం బండి సంజయ్ జైలు నుంచి విడుదల అయ్యారు. బండి సంజయ్ను అరెస్ట్ చేయడం రెండు రోజుల పాటు రాష్ట్రంలో ఉద్రిక్తతలకు దారితీసింది. బీజేపీ కార్యకర్తలు ఎక్కడికక్కడ ఆందోళనలకు దిగారు. బండి సంజయ్ను అక్రమంగా అరెస్ట్ చేశారంటూ నిరసనలు చేపట్టారు. ఫోన్ మిస్సింగ్ వ్యవహారంపై పరస్పర రాజకీయ విమర్శలు కొనసాగుతున్నాయి.