ఐదవ రోజుకు చేరుకున్న బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్ర
తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: బిజెపి రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ కుమార్ చేపట్టిన ప్రజా సంక్రమ యాత్ర శుక్రవారం ఐదవ రోజుకు చేరుకుంది. అంబకంటి గ్రామ శివారులోని రాత్రి శిబిరం నుంచి ప్రారంభం కానున్న బండి సంజయ్ బాంనీ, నందన్, నర్సాపూర్, కుస్లీ గేట్, నసిరాబాద్ మీదుగా రాంపూర్ వరకు పాదయాత్ర కొనసాగనుంది. నర్సాపూర్ లో కార్నర్ మీటింగ్ లో ప్రజలనుద్దేశించి ప్రసంగించనున్న బండి ఈరోజు మొత్తం 12.1 కిలోమీటర్లు నడుస్తారు అదేవిధంగా రాత్రి రాంపూర్ సమీపంలో ఆయన బస చేయనున్నారు.