మర్రిగూడ లో నేడు బండి సంజయ్ ప్రెస్ మీట్
తెలంగాణ జ్యోతి/ వెబ్ న్యూస్: ఆదివారం మధ్యాహ్నం 12 గంటలకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ మునుగోడు నియోజకవర్గంలోని మర్రిగూడ మండల కేంద్రంలోని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఎన్నికల క్యాంపు కార్యాలయంలో పాత్రికేయుల సమావేశం నిర్వహించడం జరుగుతుందని బిజెపి శ్రేణులు ఒక ప్రకటనలో తెలిపాయి. ఈ సందర్భంగా నల్గొండ బిజెపి జిల్లా కార్యాలయం నుండి మర్రిగూడ కు పాత్రికేయుల కోసం ప్రత్యేకంగా వాహనాలు ఏర్పాటు చేసినట్లు వారు తెలిపారు.