బండి సంజయ్ సంచలన కామెంట్స్

-   కాంగ్రెస్ అభ్యర్థులను కూడా సీఎం కేసీఆరే డిసైడ్ చేస్తారు

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ అభ్యర్థులను కూడా సీఎం కేసీఆరే డిసైడ్ చేస్తారని అన్నారు. ఈ సందర్బంగా ఆదివారం ఆయన కరీంనగర్‌లో మీడియాతో మాట్లాడుతూ 30 మంది అభ్యర్థుల జాబితా సిద్ధం చేశారన్నారు. మహిళల దుస్తుల మీద కాకుండా.. ఉగ్రవాదుల మీద దృష్టి పెట్టాలని సూచించారు. అసలు మహమూద్ ఆలీ హోంమంత్రి అని ఎవరికైనా తెలుసా? అని ప్రశ్నించారు. మహిళలు గాజులు, బొట్టు పెట్టుకుంటే తీసేసినప్పుడు ఎక్కడ ఉన్నారని నిలదీశారు. తెలంగాణ అభివృద్ధిపై చర్చకు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి వస్తారని.. సీఎం కేసీఆర్ వస్తారా? అని సవాల్ చేశారు. పరేడ్ గ్రౌండ్‌లో చర్చకు సిద్ధమా? అన్నారు. హైదరాబాద్ దేశ రెండో రాజధానిపై పార్టీలో చర్చిస్తామని, తెలంగాణకు ఏది మంచో అదే చేస్తామని బండి సంజయ్ స్పష్టం చేశారు.

Leave A Reply

Your email address will not be published.