వచ్చే నెలలో కామారెడ్డి జిల్లాలో బండి సంజయ్ పర్యటన
తెలంగాణ జ్యోతి/ వెబ్ న్యూస్: కామారెడ్డి జిల్లాలో వచ్చే నెల మొదటి వారంలో తరుణ్ చుగ్ మరియు బండి సంజయ్ పర్యటన ఉండనున్నట్లు నిన్న జరిగిన జిల్లా నేతల సన్నాహక సమావేశంలో బండి సంజయ్ జిల్లా నేతలతో చర్చించినట్లు తెలిసింది. జిల్లా వ్యాప్తంగా భాజపా పనితీరు మరియు నియోజకవర్గాల్లో బిజెపి యొక్క ఎదుగుదల గురించి చర్చించారు. ప్రజల మధ్యలో ఉండి ప్రజా పోరాటాలపై ఉద్యమాలు చేయాలని హైదరాబాద్ లో ఉండి లాబీయింగు చేస్తే టికెట్లు రావని నియోజకవర్గ నేతలకు బండి సంజయ్ హెచ్చరించారు. ఈ నేపథ్యంలో వచ్చే నెలలో జరిగే బండి సంజయ్ పర్యటనను పెద్ద ఎత్తున విజయవంతం చేస్తామని నాయకులు సంజయ్ కి హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షురాలు అరుణతార, కామారెడ్డి నియోజకవర్గ నాయకుడు వెంకటరమణారెడ్డి, బాన్సువాడ మల్యాద్రి రెడ్డి, ఎల్లారెడ్డి లక్ష్మారెడ్డి బాణాల, మరియు జిల్లా ఇన్చార్జ్ బద్దం మైపాల్ రెడ్డి, జిల్లాలోని అన్ని మండలాల అధ్యక్షులు కూడా పాల్గొన్నారు.