టాస్ గెలిచిన బ్యాటింగ్ ఎంచుకున్న బెంగళూరు టీం

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్:  ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) లో నేడు మళ్లీ డబుల్ హెడర్ మ్యాచ్‌లు జరగనున్నాయి. జైపూర్‌లోని సవాయ్ మాన్‌సింగ్ స్టేడియంలో రాజస్థాన్ రాయల్స్ (RR) వర్సెస్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) మధ్య రోజు మొదటి మ్యాచ్ జరుగుతోంది. టాస్ గెలిచిన బెంగళూరు టీం తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. దీంతో శాంసన్ సేన ముందుగా బౌలింగ్ చేయనుంది.

జైపూర్‌లో రాజస్థాన్, బెంగళూరు మధ్య ఇప్పటివరకు 7 మ్యాచ్‌లు జరిగాయి. ఇందులో నాలుగు మ్యాచ్‌లు రాజస్థాన్‌, మూడు మ్యాచ్‌లు బెంగళూరు గెలుపొందాయి. రాజస్థాన్‌పై బెంగళూరు ఈ మైదానంలో గత 10 ఏళ్లుగా గెలవలేదు. 2013లో ఇక్కడ చివరి విజయం సాధించింది. చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో చెన్నై సూపర్ కింగ్స్ (CSK) వర్సెస్ కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) మధ్య రెండో మ్యాచ్ జరగనుంది.

Leave A Reply

Your email address will not be published.