బాన్సువాడను జిల్లా కేంద్రంగా ప్రకటించాలి

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్/బాన్సువాడ: బాన్సువాడ ఆర్డిఓ కార్యాలయం ముందు భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ ఆధ్వర్యంలో బాన్సువాడ జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేయాలని శనివారం ధర్నా నిర్వహించి అనంతరం ఏవో సువర్ణ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ ధర్నాను ఉద్దేశించి సిపిఐ బాన్సువాడ నియోజకవర్గ ఇన్చార్జి దుబాస్ రాములు మాట్లాడుతూ ప్రజల సౌలభ్యం కొరకు దూరాబారం తగ్గడం కొరకు బాన్సువాడ జిల్లా చేయాలని ఆయన తెలిపారు బాన్సువాడ, బీర్కూర్ నస్రుల్లాబాద్ వర్ని చందూర్ మోస్రా రుద్రూర్ కోటగిరి పొతంగల్, జుక్కల్ మద్నూర్ డోంగ్లి, బిచ్కుంద, పెద్ద కొడప్ గల్, పిట్లం నిజాంసాగర్, కల్లేరు, సిర్గాపూర్ మండలాలతోపాటు హనుమాజ్ పేట్, మహమ్మద్ నగర్ ఈ రెండు కొత్త మండలాలుగా ఏర్పాటు చేయాలని ఆయన తెలిపారు బిచ్కుందను రెవిన్యూ డివిజన్ చేయాలని డిమాండ్ చేశారు మొత్తం 20.మండలాలతో 34.వ జిల్లాగా బాన్స్వాడను ప్రకటించాలని తెలిపారు ఈ ధర్నాలు ఏఐటియుసి డివిజన్ కన్వీనర్ డి శంకర్, సాయిలు, శివాజీ, నాగరాజు, ఎల్లయ్య, భూమయ్య, హనుమాన్లు, లక్ష్మీ, రాజు, సోపాన్, ఎల్లవ్వ, వెంకటి తదితరులు పాల్గొన్నారు

Leave A Reply

Your email address will not be published.