బరాక్ ఒబామా ఓ ప్రైవేటు వ్యక్తి ..

- ఆయనకు శ్వేత సౌధంతో సమన్వయం లేదు - అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా ను అమెరికా ప్రభుత్వం

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: భారత దేశంలో మైనారిటీల రక్షణ గురించి వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా ను అమెరికా ప్రభుత్వం సున్నితంగా పక్కనబెట్టింది. ఆయన పట్ల సమున్నత గౌరవం ఉన్నప్పటికీఆయన ఓ ప్రైవేటు వ్యక్తి అనిశ్వేత సౌధంతో ఆయనకు సమన్వయం లేదని తెలిపింది.

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఇటీవల అమెరికా ప్రభుత్వ అతిథిగా సమున్నత గౌరవం పొందుతూ ఆ దేశంలో పర్యటించిన సంగతి తెలిసిందే. ఆ దేశాధ్యక్షుడు జో బైడెన్ దంపతులు అత్యంత ఆత్మీయతతో మోదీని ఆహ్వానించిగౌరవించారు. జూన్ 22న వైట్ హౌస్ సౌత్ లాన్‌లోకి బైడెన్ అత్యంత గౌరవమర్యాదలతో మోదీని ఆహ్వానించారు. అదే రోజు బరాక్ ఒబామా ఓ టీవీ చానల్‌తో మాట్లాడుతూమెజారిటీ హిందూ ఇండియాలో ముస్లిం మైనారిటీల రక్షణ గురించి మోదీతో బైడెన్ మాట్లాడాలన్నారు. తాను మోదీతో మాట్లాడి ఉంటేతన వాదనలో కొంత భాగం భారత దేశంలో మైనారిటీల హక్కుల గురించే ఉంటుందన్నారు. ‘‘దేశంలోని మైనారిటీల హక్కులను భారత దేశ ప్రధాన మంత్రి కాపాడకపోతేభారత దేశం విడిపోయే అవకాశం బలంగా ఉంటుంది. ఈ విస్తృత అంతర్గత సంఘర్షణలు ముస్లిం ఇండియా’, ‘హిందూ ఇండియాల ప్రయోజనాలకు విరుద్ధం’’ అని అన్నారు.

ఒబామా వ్యాఖ్యలు మన దేశంలో రాజకీయ ప్రకంపనలు సృష్టించాయి. రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ ఆయనను తీవ్రంగా విమర్శించారు. ముస్లింలు అధికంగా ఉన్న ఆరు దేశాలపై ఒబామా నేతృత్వంలోని అమెరికా బాంబులు కురిపించిందని నిర్మల సీతారామన్ గుర్తు చేశారు. అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ స్పందిస్తూభారత దేశంలోనే చాలా మంది హుస్సేన్ ఒబామాలు ఉన్నారనిఅలాంటివారిపై అస్సాం పోలీసులు చర్యలు తీసుకుంటారని చెప్పారు.

ఈ నేపథ్యంలో ఓ జాతీయ పత్రిక శ్వేత సౌధం సీనియర్ అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్‌ను ఇంటర్వ్యూ చేసింది. ఆ అధికారి ఆ పత్రికకు తెలిపిన వివరాల ప్రకారంప్రధాని మోదీతో ప్రతి అంశాన్ని బైడెన్ ప్రస్తావించారు. అదేవిధంగా మోదీ కూడా బైడెన్‌తో ప్రతి అంశం గురించి మాట్లాడారు. అయితే ఈ సంభాషణ గౌరవప్రదంగాహుందాగా జరిగింది.

ఒబామా కఠిన సందేశాన్ని పంపించడంబైడెన్ ఇండియాను మచ్చిక చేసుకోవడంలో మంచి పోలీసు-చెడ్డ పోలీసు’ విధానం ఉందనే ఊహాగానాల్లో నిజం ఉందా అని ఆ పత్రిక ప్రశ్నించినపుడు ఆ అధికారి స్పందిస్తూఅమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా పట్ల తమకు గొప్ప గౌరవం ఉందనిఅయితే ఆయన ఓ ప్రైవేటు వ్యక్తి అనిఆయన మాటలు తమతో సమన్వయంతో మాట్లాడినవి కాదని చెప్పారు. బైడెన్-మోదీ మధ్య జరిగిన ప్రైవేటు సంభాషణ స్వభావాన్ని తాను వివరించలేనని చెప్పారు. అయితే ప్రతి అంశాన్నీప్రతి సమస్యను వారు చర్చించారని చెప్పగలనని తెలిపారు. అత్యున్నత స్థాయి హుందాతనంతో ఈ పని చేయడం బైడెన్ శైలి అని తెలిపారు. సన్నిహిత భాగస్వామ్య స్ఫూర్తితో మాట్లాడటంభాగస్వాములను గౌరవంగా చూడటం బైడెన్ శైలి అని చెప్పారు. ప్రధాని మోదీతో కూడా ఈ విధంగానే ఆయన వ్యవహరించారని భావిస్తున్నానన్నారు. చర్చించాలని కోరుకునే అంశాలు ప్రతి దేశానికి ఉంటాయన్నారు. సమస్యల గురించి నేరుగా మోదీతో బైడెన్ మాట్లాడటం కాదనిమోదీ కూడా కొన్ని అంశాలను లేవనెత్తాలని కోరుకుంటారని అన్నారు. సమస్యలను గౌరవప్రదంగా చర్చించడానికి వారి మధ్యగల గాఢమైన సత్సంబంధాలు అవకాశం కల్పించాయన్నారు. తాను చెప్పినదానిని ఎదుటివారు గౌరవభావంతో విన్నారనే విశ్వాసం కలిగేలా వారు మాట్లాడుకున్నారని చెప్పారు.

వాల్ స్ట్రీట్ జర్నల్ రిపోర్టర్ సబ్రినా సిద్ధికీ ప్రధాని మోదీని ప్రశ్నించిన తీరుపై విమర్శలు వస్తున్న నేపథ్యంలో ఈ వివాదం గురించి అడిగిన ప్రశ్నకు వైట్ హౌస్ అధికారి స్పందిస్తూపత్రికా స్వేచ్ఛ చాలా ముఖ్యమని తాము విశ్వసిస్తున్నామన్నారు. ఆన్‌లైన్ వేధింపులకు తాము మద్దతిచ్చేది లేదన్నారు. ఆ రిపోర్టర్‌పై ఆన్‌లైన్ వేధింపులు తమను తీవ్ర ఆందోళనకు గురి చేస్తున్నాయన్నారు.

Leave A Reply

Your email address will not be published.