బండి సంజయ్ ని కలిసిన బాసర వేద విద్యార్థులు

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: ప్రజాసంగ్రామ యాత్ర చేపట్టిన బిజెపి చీఫ్ బండిసంజయ్ ను ఆదివారం రాత్రి బాసరకు చెందిన “వేద భారతి పీఠ వేద విద్యాలయం” వేద విద్యార్థులు రాత్రి శిబిరం వద్ద బండి సంజయ్ ని కలిశారు. బండి సంజయ్ కి వేద ఆశీర్వచనం చేసిన వేద విద్యార్థులు బండి సంజయ్ “ప్రజా సంగ్రామ యాత్ర” దిగ్విజయంగా జరగాలని ఆశీర్వదించార్. అడుగడుగునా వేద విద్యాలయాలు నెలకొల్పడం వలన మన హిందూ ధర్మం రక్షించబడుతుంది, అందరికీ వేదాలు నేర్పించాలన్నదే మా సంకల్పం అన్న వేద విద్యార్థులు హిందూ ధర్మ రక్షణ కోసం పనిచేస్తున్నామని బండి వారితో వెల్లడించారు. తెలంగాణలో బిజెపి ప్రభుత్వం ఏర్పడ్డాక, వేద పాఠశాలల సంఖ్యను మరింత పెంచే విధంగా కృషి చేస్తామని బండి సంజయ్ హామీ ఇచ్చారు.

Leave A Reply

Your email address will not be published.